ఒక్క దృశ్యం.. మనల్ని కట్టి పడేస్తుంది.. అందుకే వందల కొద్దీ వీడియోల కంటే.. ఒక్క ఫోటో చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు పెద్దగా సినిమాలు లేని రత్తాలు.. అదేలెండి మన లక్ష్మీరాయ్.. ఓ అదిరే ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్టు చేసింది.


కొండలు, సెలయేరు వంటి ప్రకృతి అందాల మధ్య వంకాయ రంగు వస్త్రంతో కట్టిపడేసే ఫోటో దిగింది. అరటి బోదెల్లా కవులు వర్ణించే తొడ అందం మాత్రమే కనిపించేలా జాగ్రత్త పడిన రత్తాలు కంటే.. ఆ ఫోజ్ ఆకట్టుకుంటోంది.


ఈ ఫోటోలో రత్తాలు గొప్పదనం కంటే ఫోటోగ్రాఫర్ క్రియేటివిటీయే ఎక్కువగా చెప్పుకోవాలి. లక్ష్మీరాయ్ కూడా అదే అంటోంది. ఈ ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్ కిరణ్ అనే ఆవిడను లక్ష్మీరాయ్ తెగ పొగిడేసింది. ఇలాంటి ఫోటోలు ఇంకొన్ని నీతో తీయించుకోవాలని ఉందోయ్.. అంటూ మెచ్చుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: