కేవలం ఒక్క సినిమా తోనే ఓవర్ నైట్ స్టార్ అయిన 'విజయ్ దేవరకొండ', టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ "అర్జున్ రెడ్డి" సినిమాతో జనాలను ఆకట్టుకున్నాడు.ప్రస్తుతం "డియర్ కామ్రేడ్" అనే సినిమాతో మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు. బాహుబలి తరువాత పలు భాషలలో రిలీజ్ అవుతున్న తొలి చిత్రంగా డియర్ కామ్రేడ్ రికార్డ్ సృష్టించనుంది. 



ఈనేపధ్యంలో డియర్ కామ్రేడ్ సినిమా చూసిన బాలీవుడ్ దర్శక నిర్మాత "కరణ్ జోహార్" ఆకర్షితుడై ఈ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాడు. అయితే కరణ్ బాలీవుడ్ లోనూ విజయ్ ను హీరోగా నటించమని కోరగా విజయ్ ఈ ఆఫర్ ను తిరస్కరించాడు. ఎందుకనగా ఒకే కథలో రెండు సార్లు నటించడం తనకు ఇష్టం ఉండదని అందుకే నో చెప్తున్నట్లు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 


గతంలో అర్జున్ రెడ్డి రీమేక్ విషయంలో నో చెప్పిన విజయ్ తాజాగా ఈ విషయంలో కూడా అదే విధంగా స్పందించాడు. హిందీ సినిమాల్లో అవకాశం వస్తే నటిస్తానని కానీ, ముంబయ్ లో స్థిరపడే ఆలోచన మాత్రం లేదని చెప్పారు. తెలుగు,హిందీ భాషల్లో కూడా మంచిగా ఉండే స్క్రిప్ట్ దొరికితే బాలీవుడ్ సినిమా చెయ్యడానికి సిధ్దంగా ఉన్నట్లు తెలిపారు.



 విజయ్,రష్మిక హీరో,హీరోయిన్ లుగా నటించిన "డియర్ కామ్రేడ్" జూలై ఇరవై ఆరున ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ భాషలలో ఒకే రోజు రిలీజ్ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: