తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘మాస్టర్’, ‘ఇద్దరు మిత్రులు’ వంటి సినిమాల్లో నటించిన సాక్షి శివానంద్.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌గా వరుసగా తెలుగులో ఉన్న  బాలకృష్ణ,నాగార్జున, మోహన్ బాబు వంటి అగ్ర హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత ఏమైందో ఏమో సడెన్‌గా పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. 


సాక్షి శివానంద్ హీరోయిన్‌గా జోరు మీదున్నపుడే ఆమె సోదరి శిల్పా ఆనంద్.. మంచు విష్ణు హీరోగా పరిచమైన ‘విష్ణు’ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఈ సినిమా తర్వాత ఈ అమ్మడుకు సినిమాల ఛాన్సులు రాకపోవడంతో ఈమె కూడా పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం ఈ భామ హిందీలో పలు టీవీ సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా ఉంది.


తాజాగా ఈ భామ..తనను చంపేదందుకు తన అక్క సాక్షి శివానంద్‌తో పాటు ఆమె అత్త ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. తన బీమా డబ్బుల కోసమే తనపై ఈ హత్య ప్రయత్నం చేసినట్టు ప్రకటించి సంచలన సృష్టించింది. 


గతంలో తన తల్లిపై కూడా  ఇలాగే తన అక్క...ఆమె అత్త హత్నా యత్నానికి ప్రయత్నించినట్టు తెలిపింది.ఈ విషయమై నేను కంప్లైట్ చేసే లోపే వాళ్లు అమెరికాకు పారిపోయారంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. దీనిపై పోలీసులు విచారణ జరిపి వాళ్లను తగిన విధంగా శిక్షించాలని కోరింది.


మరింత సమాచారం తెలుసుకోండి: