తెలుగులో సూపర్ హిట్ అయిన 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్’ టైటిల్‌తో రీమేక్ చేస్తే అక్కడ కూడా సంచలన విజయం సాధించింది. అంతేకాదు సోలోగా షాహిద్ కపూర్ కెరీర్‌లనే అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా నిలిచింది ‘కబీర్ సింగ్’. ఇక హిందీ ‘కబీర్ సింగ్’ ను కూడా అర్జున్ రెడ్డిని డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేయడంతో ఈ సినిమా అక్కడ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.


ఈ సినిమాతో హీరో షాహిద్ కపూర్‌తో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ఐతే ఈ సినిమా విజయం తర్వాత షాహిద్ కపూర్ ప్రవర్తనలో చాలా తేడా వచ్చిందని, అతని యాటిట్యూడ్ చూపిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో షాహిద్ పై గుర్రుగా వున్నారు నెటిజన్లు. వివరాలలోకి వెళితే..


ఇటీవల షాహిద్ కపూర్ తన కూతురు మిషాను తీసుకుని ముంబైలోని ఓ ప్లేసుకు వచ్చారు. ఆయన వస్తున్న విషయం ముందే తెలుసుకున్న మీడియా కెమెరామెన్లు అక్కడ వెయిట్ చేయడం మొదలు పెట్టారు. అయితే కారులో నుంచి దిగిన షాహిద్ ఫోటో గ్రాఫర్లకు ఫోజులు ఇవ్వకుండా వెళ్లిపోయారు. దీంతో కబీర్ సింగ్ సక్సెస్ తర్వాత షాహిద్ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. సక్సెస్ తలకెక్కినట్లు ఉంది అనే వాదన తెరపైకి వచ్చింది. షాహిద్ ప్రవర్తన సక్సెస్ సైడ్ ఎఫెక్ట్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు గుప్పిస్తున్నారు. విజయాన్ని ఎప్పుడూ తలకెక్కించుకోకూడదు, ఇలా ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తే నీకే నష్టం కలుగుతుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు. 


ఇప్పటికైనా ఈ విషయంలో నువ్వు రియలైజ్ అవ్వాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. .అయితే షాహిద్‌కు మద్దతుగా ఇటు అభిమానులు రంగంలోకి దిగారు. వెంట తన చిన్నారి కూతురు ఉంది కాబట్టి షాహిద్ మీడియా వారి కెమెరా ముందు ఫోజులు ఇవ్వలేక పోయారని.. దీన్ని అంతగా భూతద్దంతో  రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. అపుడు షాహిద్ ఏ పరిస్థితిలో ఉన్నాడో అంటూ షాహిద్ ను సపోర్ట్ కూడా చేస్తున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: