స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో భారీ అంచనాలతో హ్యాట్రిక్ మూవీ సెట్స్ మీద ఉంది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల ఫలితాలను రిపీట్ చేసేలా ఈ సినిమా ఉండబోతుందని అంటున్నారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సుశాంత్, నివేదా పేతురాజ్ కూడా నటిస్తున్నారు.  


ఈ సినిమాకు నాన్న నేను అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇక ఈ మూవీ తర్వాత బన్ని అసలైతే సుకుమార్ సినిమా చేయాల్సి ఉంది. ఆల్రెడీ సినిమా ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. ఈ సినిమాతో పాటుగా బన్ని వేణు శ్రీరాం డైరక్షన్ లో ఐకాన్ సినిమా లైన్ లో పెట్టాడు. ఆ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తుంది.   


అయితే ఐకాన్ సినిమానే ముందు షూటింగ్ కు వెళ్తుందట. సుకుమార్ ఇంకా ఫుల్ స్క్రిప్ట్ పూర్తి చేయలేదట. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా సరే సుకుమార్ కు స్టార్ ఛాన్సులు దక్కట్లేదు. అసలైతే మహేష్ తో సుకుమార్ సినిమా ఉండాల్సింది. కాని మహేష్ అనీల్ రావిపుడి సినిమా తర్వాత సుకుమార్ సినిమా చేస్తా అన్నాడని అతన్ని కాదని బన్నితో సినిమా ఎనౌన్స్ చేయించుకున్నాడు మహేష్. 


ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అల్లు అర్జున్ కూడా మరో ఏడాది వరకు సినిమా ఛాన్స్ లేదని సుకుమార్ కు చెబుతాడని అంటున్నారు. అనీల్ రావిపుడి సరిలేరు నీకెవ్వరు కాగానే సుకుమార్ సినిమా అనుకున్నాడు కాని బన్నితో వెంటనే చేయాలని తొందరపడ్డాడు సుకుమార్ కాని ఇప్పుడు అతనికి బన్ని ఛాన్స్ కూడా దక్కేలా లేదు. మరి సుకుమార్ మరో హీరోని చూసుకుంటాడా లేక వెయిట్ చేస్తాడా అన్నది చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: