టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకతని చాటుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా సినిమాలు చేస్తూనే బాహుబలిలో భల్లాలదేవగా కనిపించి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. యూనివర్సల్ ఆక్సెప్టెన్సీ ఉన్న కథలని ఎంచుకుని తన కంటూ ఒక కొత్త దారిని నిర్మించుకున్నాడు. ఇటు తెలుగుతో పాటు, హిందీలో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.


గత  కొంత కాలంగా రానా ఆరోగ్యం పై రకరకాల వార్తలు వస్తున్నాయి.గత కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతున్నాడని..అందుకే మునుపటికంటే చాల సన్నగా అయ్యాడని..ప్రస్తుతం హెల్త్ చెక్ అప్ కోసం అమెరికా వెళ్లాడని ఇలా రకరకాల వార్తలు మీడియా లో గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ వార్తల ఫై ఎప్పటికప్పుడు సురేష్ బాబు ఖండిస్తూ వస్తున్న కానీ ప్రచారం మాత్రం ఆగడం లేదు.

తాజాగా మరోసారి ఇదే రిపీట్ కావడం తో రానా ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.ఈ రోజు ఉదయం డియర్‌ కామ్రేడ్‌ టీంకు ఆల్‌ ద బెస్ట్ చెపుతూ రానా ఓ వీడియో మెసేజ్‌ను పోస్ట్ చేశాడు. అయితే వీడియో పోస్ట్‌కు కామెంట్స్‌లో అభిమానులు రానాను ఆరోగ్య పరిస్థితిపై ప్రశ్నించటంతో ‘అలాంటి వార్తలను చదవడం మానేయండి’ అంటూ కామెంట్ చేశాడు. 


ప్రస్తుతం అమెరికాలో ఉన్న రానా అక్కడే డియర్‌ కామ్రేడ్ సినిమా చూడబోతున్నట్టుగా చెప్పుకొచ్చాడు. మరి ఇప్పుడైనా ఈ వార్తలకు చెక్ పడుతుందో..లేక ఇలాగే కొనసాగుతాయో చూడాలి. ప్రస్తుతం రానా హిందీలో హాథీ మేరే సాథీ అనే సినిమాను చేస్తున్నాడు. అలాగే తెలుగులో రాజ్ తరుణ్ తో ఒక సినిమాను నిర్మిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: