బాహుబలి సిరీస్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న `సాహో` సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’ కోసం ఆయన అభిమానులు, సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో వాళ్లకు షాక్ ఇస్తు ఆగస్టు 15న రీలిజ్ కావాల్సి సినిమా ఆగష్టు 30కి వాయిదా పడింది.
సాహో వాయిదా పడడంతో అదే రోజు రిలీజ్ కాబోయే నేచురల్ స్టార్ నాని గ్యాంగ్ లీడర్ సినిమా సస్పెన్స్లో పడింది. అలాగే కోలీవుడ్ కోలీవుడ్ హీరో సూర్య నటిస్తున్న `కాప్పన్` సినిమా కూడా డిఫిన్స్లో పడినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో సూర్యతో పాటు మోహన్లాల్, ఆర్య లాంటి స్టార్స్ నటించిన సినిమా కావటంతో ఈ సినిమాపై నిర్మాతలు ఎంతో నమ్మకంతో ఉన్నారట.
నిజానికి ఈ కాప్పన్ సినిమాను ఆగష్టు 15కు ఫిక్స్ చేయాలనుకుంటే సాహో కారణంగానే ఆగష్టు 30కు రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యారట. అయితే సాహో వాయిదా పడడంతో ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు పోటీ పడితే బాక్సాఫీస్ వద్ద మామూలుగా ఉండదు. మరి యాక్షన్ థ్రిల్లర్ను `సాహో`ను ఢీ కొట్టి `కాప్పన్` ఏ మాత్రం వసూళ్లు రాబట్టుకుంటుందో చూడాలి.