ఈ ఏడాది వరుస సక్సెస్లతో మంచి జోరు మీద సమంత ఉంది. మజిలీ, ఓ బేబీ సినిమా సక్సెస్ లతో వరుసగా రెండు హిట్లు అందుకున్న సమంత రాబోయే రోజుల్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఫిలింనగర్లో వార్తలు వినపడుతున్నాయి. ఇటువంటి క్రమంలో తాజాగా సమంతకు హైకోర్టు షాక్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ నుండి కొత్త వార్త వినబడుతోంది.


విషయంలోకి వెళితే అప్పట్లో అనగా 2010లో బాలీవుడ్ ఇండస్ట్రీలో రణ్వీర్ సింగ్ హీరోగా అనుష్క శర్మ హీరోయిన్ గా నటించిన సినిమా 'బ్యాండ్ బాజా బారాత్'.  ఈ సినిమాను తమిళం, తెలుగులో కూడా చేయాలని యాష్ రాజ్ ఫిలిమ్స్ భావించింది. కానీ 2013లో దాన్ని శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ సంస్థ 'జబర్దస్త్' పేరుతో తెలుగులోకి రీమేక్ చేశారు. నందిని రెడ్డి దర్శకురాలు. సమంత, సిద్దార్థ్ ప్రధాన పాత్రల్లో నటించారు.


దీంతో తమ సినిమా కంటెంట్ కాపీ కాబడిందని అప్పట్లో యాష్ రాజ్ ఫిలిమ్స్ యాజమాన్యం కోర్టులో పిటిషన్ వేసింది. కేసును విచారించిన కోర్ట్ సినిమా కాపీ కాబడిందని చెబుతూ ఇకపై చిత్రాన్ని డీవీడీలు, వీసీడీలు, బ్లూరే డిస్క్స్ ఫార్మాట్లలో విడుదలచేయడం కానీ టీవీల్లో ప్రదర్శించడంకానీ చేయకూడదని ఉత్తర్వులు ఇచ్చింది. మొత్తం మీద ఈ పరిణామంతో సమంతకు షాక్ ఇచ్చినట్లయింది అని అంటున్నారు ఇండస్ట్రీ కి చెందినవారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: