ఇస్మార్ట్ శంకర్ హిట్ తో మళ్ళీ గాడిలో పడ్డాడు పూరి జగన్నాథ్, ప్రస్తుతం ఆయన సక్సెస్ ను ఎంజాయ్ చేసే పనిలో ఉన్నాడు.కానీ మహేష్ బాబు ఫాన్స్ మాత్రం పూరి మీద చాలా కోపంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. అందుకు కారణం ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ అవ్వడానికి ముందు ఓ ఇంటర్వ్యూలో మహేష్ పై పూరి చేసిన కామెంట్లే,మహేష్ కేవలం హిట్ కొట్టిన డైరెక్టర్ కి మాత్రమే ఆఫర్ ఇస్తాడాని హిట్ లేకుంటే ఎంత టాలెంట్ ఉన్న పట్టించుకోడాని అన్నాడు.
అందుకు పూరి జగన్నాథ్ ను మహేష్ ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా ఒక ఆట ఆడుకుంటున్నారు, "పోకిరి" సినిమా ముందు పూరి కి ఏం హిట్లు లేవని ఆయన తీసిన "సూపర్","143" సినిమాలు ప్లాప్ అయ్యాయని, అలాగే "బిజినెస్ మెన్" సినిమా కి ముందు పూరి తీసిన "గోలిమర్", "నేను నా రాక్షసి" కూడా డిసాస్టర్స్ అని కేవలం పూరి మహేష్ ను అవమానించడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపించారు.
అయితే పూరి చెప్పిన దాంట్లో నిజం ఉందని మహేష్ కేవలం హిట్ కొట్టిన దర్శకులకు మాత్రమే ఛాన్స్ ఇస్తాడాని కావాలంటే మహేష్ ట్రాక్ రికార్డ్ చూడాలని, తనకి మొదట కమర్షియల్ హిట్ ఇచ్చిన గుణశేఖర్ కి తర్వాత రెండు అవకాశాలు ఇచ్చాడు.అలాగే పోకిరి కి ముందు మహేష్ కి 4సినిమాలు డిసాస్టర్ గా ఉన్నాయి.పోకిరి తర్వాత  బిజినెస్ మెన్ కి కూడా అవకాశం వచ్చింది పూరికి. తనతో "దూకుడు" తీసిన శ్రీనువైట్ల కి రెండో అవకాశం ఇచ్చాడు, ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీకాంత్ అడ్డాల, కొరటాల శివ, ఇప్పుడు ఆ లిస్ట్ లో వంశీ పైడిపల్లి చేరిపోయాడు. కేవలం తనతో హిట్ కొట్టిన లేక హిట్ సినిమా తీసిన వాళ్ళతోనే మహేష్ పని చేస్తాడని కొంత మంది సినిప్రియుల వాదన.


మరింత సమాచారం తెలుసుకోండి: