తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సార్లు మంచి హిట్ అయిన చిత్రం కొంత మంది హీరోలు అయ్యో ఇంత మంచి హిట్ చిత్రం మిస్ అయ్యామే అని బాధపడ్డ హీరోలు చాలా మంది ఉన్నారు.  అలాంటిదే ఇప్పుడు మెగా హీరో సాయిధరమ్ తేజ్ విషయంలో జరినట్లు తెలుస్తుంది..ఇది టాలీవుడ్ లో జరుగుతున్న చర్చలు మాత్రమేనండోయ్.  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ కథానాయకుడిగా రూపొందిన 'ఇస్మార్ట్ శంకర్' సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్లు రాబడుతుంది.

అయితే ఈ చిత్రం రిలీజ్ కి ముందు అటు డైరెక్టర్ గా పూరి ఇటు హీరోగా రామ్ కి సరైన హిట్స్ లేకపోవడం..ఇంత మంచి హిట్ అందుకోవడంతో సంతోషంలో మునిగిపోయారు.  వాస్తవానికి తన తనయుడు ఆకాశ్ తో చేయడానికి పూరి ఈ కథను సిద్ధం చేసుకున్నాడట. అయితే అప్పుడే అంతటి మాస్ డోస్ వున్న కథ అతనితో వద్దని సన్నిహితులు చెప్పడంతో, సాయిధరమ్ తేజ్ కి వినిపించాడట. అయితే స్టోరీ నచ్చినా..అప్పటికే సాయిధరమ్ కి వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు.

మరోవైపు పూరి కూడా వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్నారు, అలాంటి సమయంలో అంత రిస్క్ తీసుకోవడం అంతగా ఆసక్తిని చూపలేదట తేజూ. దాంతో పూరి ఈ సినిమాను రామ్ తో చేశాడు. ఈ సినిమాను వదులుకున్నందుకు తేజు చాలా ఫీలవుతున్నాడట. తన ఫ్రెండ్స్ తో ఈ విషయం చెప్పుకుని బాధపడుతున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: