సౌత్ లో ప్రభుదేవా తర్వాత డైరెక్టర్ గా లారెన్స్ కి గుర్తింపు ఉంది. కొరియోగ్రాఫర్ గా లారెన్స్ కెరీర్ కి చిరంజీవి.. రజనీకాంత్ .. నాగార్జున లాంటి హీరోలు ఎంతగానో సపోర్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నటుడిగా దర్శకుడిగా లారెన్స్ సత్తా చాటుతున్నాడు. తెలుగు-తమిళ్ లో చాలానే విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన లారెన్స్ కాంచన(ముని) సిరీస్ సక్సెస్ తో జాతీయ స్థాయిలో పాపులరయ్యాడు. ప్రస్తుతం బాలీవుడ్లో అక్షయ్ కుమార్ హీరోగా కాంచన రీమేక్ లక్ష్మీ బాంబ్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే లారెన్స్ తెరకెక్కించే నెక్స్ట్ సినిమా గురించి ఆసక్తికర ప్రచారం మొదలైంది.
లక్ష్మీ బాంబ్ తర్వాత లారెన్స్ ఓ సూపర్ హీరో మూవీకి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కే 3డి సినిమా అని సమాచారం. 3డి సహా వీఎఫ్ ఎక్స్ కోసం సన్ పిక్చర్స్ భారీగా పెట్టుబడులు పెడుతోందట. సౌత్ లో అన్ని భాషల్లో రిలీజయ్యే ఈ సినిమాకి దాదాపు 100 కోట్ల వరకు బడ్జెట్ అవుతుందని తెలుస్తోంది. అంతేకాదు లారెన్స్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఆఫర్ ఇదేనన్న టాక్ వినిపిస్తోంది. ఇక లారెన్స్ తన సొంత ఖర్చులతో ఎంతో మంది అనాధలకు సాయం చేస్తూ చేయూతను అందిస్తున్న సంగతి తెలిసిందే.