వరుణ్‌ తేజ్‌ - హరీష్‌ శంకర్‌  కాంబినేషన్‌లో  రాబోతున్న  చిత్రం  'వాల్మీకి'.  కాగా  రీసెంట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ ను  సెప్టెంబర్ 13వ తేదీ అని.. ఆ రోజే ఈ   సినిమా విడుదల కానుందని చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడనుందని తెలుస్తోంది.   సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా విడుదల కానుందని సమాచారం.       


ఇక ఇప్పటివరకు డిఫరెంట్‌ జోనర్స్‌లో, విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న వరుణ్‌ తేజ్‌  ఈ సినిమాలో కూడా  గ్యాంగ్‌ స్టర్‌ గా  మరో డిఫరెంట్‌ క్యారెక్టర్‌ లో కనిపించబోతున్నాడు. ఇటీవలే రిలీజ్ అయిన  ఈ సినిమా ప్రీ టీజర్‌  సినిమా పై విపరీతంగా అంచనాలు పెంచింది.  ముఖ్యంగా ప్రీ టీజర్ లో వరుణ్‌ తేజ్‌ గ్యాంగ్‌ స్టర్‌ లుక్‌ లో  చాలా కొత్తగా కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకున్నాడు.  ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమా  అక్టోబర్  నాటికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను కూడా  పూర్తి చేసుకోనుందట.  


ప్రముఖ తమిళ్‌ యంగ్ హీరో అధర్వ  ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాలిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు.  రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: