టాలీవుడ్ లో ఉన్న స్టార్ ఫ్యామిలీస్ లో అక్కినేని ఫ్యామిలీ ఒకటి. ఏయన్నార్ ఉన్న టైంలో మనం సినిమా చేసి ఆ సినిమా కేవలం ఒక్క అక్కినేని ఫ్యామిలీకే సొంత అనేలా చేసుకున్నారు. మనం రీమేక్ కు ఫ్యాన్సీ ఆఫర్స్ వచ్చినా సరే నాగార్జున ఇవ్వలేదు. అయితే మనం చూసిన మిగతా స్టార్ ఫ్యామిలీస్ అలాంటి సినిమా కోసం ప్రయత్నించారు.


నందమూరి, మెగా ఫ్యామిలీలు మనం లాంటి మెమరబుల్ సినిమా చేయాలని చూస్తున్నారు.. కాని కథ సెట్ అవ్వట్లేదు. ఇదిలాఉంటే మరోసారి అక్కినేని ఫ్యామిలీనే మనం లాంటి మరో మల్టీస్టారర్ సినిమా చేయాలని చూస్తున్నారట. ఆల్రెడీ కృష్ణ కిశోర్ బంగార్రాజు సినిమాలో నాగార్జున, చైతు నటిస్తున్నారు.


అయితే అలా కాకుండా అక్కినేని మల్టీస్టారర్ సెపరేట్ గా ఉండేలా కథలు వెతుకుతున్నాడట. ఇక ఆ సినిమాకు దర్శకుడిగా రాహుల్ రవింద్రన్ ను సెలెక్ట్ చేశాడట నాగార్జున. చిలసౌతో సత్తా చాటి ఇప్పుడు మన్మథుడు 2తో వస్తున్నాడు రాహుల్. తప్పకుండా రాహుల్ టేకింగ్ కు అక్కినేని ఫ్యాన్స్ మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులు అభినందిస్తారని చెబుతున్నారు నాగార్జున.     


అక్కినేని మల్టీస్టారర్ తీస్తే అది రాహుల్ డైరక్షన్ లోనే ఉంటుందని చెప్పారు నాగార్జున. ప్రస్తుతం మన్మథుడు 2 ప్రమోషన్స్ లో ఉన్న నాగ్ ఈ సినిమాకు మన్మథుడుకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కీర్తి సురేష్, సమంతలు గెస్ట్ రోల్స్ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: