టైటిల్ చూసి కచ్చితంగా కె.జి.ఎఫ్ డైరక్టర్ ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రామ్ తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడని అనుకుని ఉంటారు. నందమూరి మల్టీస్టారర్ చేస్తే కేవలం తారక్, కళ్యాణ్ రామ్ మాత్రమే కాదు బాలకృష్ణ కూడా ఉంటాడు. ఇక్కడ విషయం ఏంటంటే ఆర్.ఆర్.ఆర్ తర్వాత తారక్ చేస్తున్న సినిమా గురించి ఓ అప్డేట్ వచ్చింది.      


కె.జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ తో ఎన్.టి.ఆర్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఆల్రెడీ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ ఇవ్వగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో కళ్యాణ్ రామ్ కూడా భాగమవుతున్నట్టు తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ తో పాటుగా కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను తీసుకుంటున్నాడట.   


ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ సినిమా చేస్తుంటాడు. తారక్ తో ఇప్పటికే జై లవ కుశ సినిమా చేశాడు కళ్యాణ్ రామ్. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో తమ్ముడు సినిమా నిర్మించే ఏ చిన్న అవకాశాన్ని వదలట్లేదు. ఓ పక్క తను హీరోగా వరుస సినిమాలు చేస్తూనే నిర్మాతగా కూడా బిజీ అవ్వాలని చూస్తున్నాడు కళ్యాణ్ రామ్.       


ఒకవేళ ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ సినిమా కన్ఫాం అయితే కళ్యాణ్ రాం కూడా ఓ నిర్మాతగా ఉంటాడని తెలుస్తుంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న కె.జి.ఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ తర్వాతే తారక్ సినిమాపై అప్డేట్ వస్తుంది. ఎన్.టి.ఆర్ కూడా ఆర్.ఆర్.ఆర్ సినిమా పూర్తయ్యేదాకా ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వట్లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: