భరత్ అనే నేను సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన  బాలీవుడ్  భామ కియారా అద్వానీ. అటు బాలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. రామ్ చరణ్ తో ఈమె నటించిన వినయ విధేయ రామ విజయం సాధించకపోవడంతో కొంత వెనుక బడిందనే చెప్పాలి. అయితే తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ "కబీర్ సింగ్" లో షాహిద్ కపూర్ సరసన నటించింది.


సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది.  మూడు వందల కోట్ల గ్రాస్ సాధించి షాహిద్ కియారా అద్వానీ కెరియర్ లో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ సినిమా విజయంతో కియారా ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఈ  అమ్మడు ఏ సినిమా చేసిన అది బ్లాక్ బస్టరే అవుతుండడం తో అమ్మడి కోసం దర్శక , నిర్మాతలు పోటీ పడుతున్నారు.


కాగా ఈ భామ అసలు పేరు కియరా అద్వానీ కాదట..అలియా అద్వాని అని చెప్పుకొచ్చింది. అయితే అప్పటికే అలియా భట్ అంటూ మరో హీరోయిన్ ఉండడంతో పేరు మార్చుకోవాలనే ఉద్దేశంతో ‘కియారా’ పదాన్ని తన అలియా అద్వానికి జోడించిందట. ఆలా కియారా అద్వానీ గా మారిందట.కియారానే ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందంటే..రణబీర్ కపూర్ ..ప్రియాంక చోప్రా జంటగా నటించిన ‘అంజానా అంజానీ’ సినిమాలో ప్రియాంక పాత్ర పేరు కియారా.


 అది బాగుండడం తో ఆలా పెట్టుకున్నట్లు తెలిపింది. ఇక ఈ అమ్మడి సినీ అవకాశాల విషయానికి వస్తే.. నటన పరంగానే కాకుండా గ్లామర్ పరంగా కూడా ఏమాత్రం అడ్డు చెప్పకుండా ఓకే చెపుతుండడం తో అమ్మడికి వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మడు తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేసినట్లు బి టౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: