ఇండస్ట్రీకి వచ్చి 13 సంవత్సరాలు అవుతున్న మాస్ హీరోగా గుర్తింపు తెచుకోలేక పోయాడు రామ్ అలాగే కొన్నాళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూపులు చూస్తున్నారు హీరో రామ్ మరియు దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఇటీవల వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ సక్సెస్ సాధించిన అద్భుతమైన కలెక్షన్లతో దూసుకెళ్తూ ఉంది. ఇక ఈ సినిమాతో వారిద్దరూ మళ్ళి ఫామ్ లోకి రావడంతో, అటు రామ్ కు, ఇటు పూరికి టాలీవుడ్ నుండి మంచి ఆఫర్లు వస్తున్నాయట. 


పూరి మార్క్ టేకింగ్, స్క్రీన్ ప్లే, అలానే రామ్ నటన, డైలాగులు, మాస్ యాక్షన్ ఫైట్స్, డాన్స్ మరియు ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలు వెరసి ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సూపర్ హిట్ టాక్ ను కట్టబెట్టాయి. అయితే వాస్తవానికి ఈ సినిమా కథను పూరి మొదట, ఒక మెగా హీరోకు వినిపించాలని అనుకున్నారట. అతడు మరెవరో కాదు సుప్రీమ్ హీరోగా పేరుగాంచిన సాయి ధరమ్ తేజ్ అట. అయితే అప్పటికే వరుసగా ఆరు ఫ్లాపులు చవిచూసిన సాయి తేజ్, మరోవైపు ఫ్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్న పూరి కథ వినడానికి సుముఖత చూపలేదట. 


అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని పూరి అన్నారు. నేను ఇస్మార్ట్ శంకర్ కథ రాసుకున్నప్పుడే రామ్ హీరోగా అనుకున్నానని కేవలం రామ్ బాడీ లాంగ్వేజ్ కి సూట్ అయ్యే కథ రాయాలనే ఈ కథ రాసనని చెప్పారు పూరి.


మరింత సమాచారం తెలుసుకోండి: