ప్రస్తుతం టాలీవుడ్ లోని క్రేజీ హీరోయిన్స్ లో ఒకరైన రష్మికకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఇటీవల ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అవడంతో ఆమె అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి ఆమె జతకట్టిన డియర్ కామ్రేడ్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. 

అయితే ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ త్వరలో నిర్మించనున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ఆయన డియర్ కామ్రేడ్ నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ వారిని కలిసి ఆ సినిమా రైట్స్ కూడా కొనుగోలు చేయడం జరిగింది. అయితే ఈ సినిమా హిందీ వెర్షన్ లో హీరోగా ధఢక్ సినిమాలో హీరోగా నటించిన ఇషాన్ ని, అలానే హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్వికపూర్ ని తీసుకోవాలని భావిస్తున్నారట. 

వాస్తవానికి ధఢక్ లో హీరో, హీరోయిన్లుగా వారిద్దరే నటించడంతో, మళ్ళి వారితోనే ఈ సినిమా కూడా తీయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే అయన సన్నిహితులు కొందరు మాత్రం రష్మిక నే హిందీ వర్షన్ లో కూడా హీరోయిన్ గా తీసుకుంటే బాగుంటుందని సలహా ఇస్తున్నారట. మరి ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా హల్ చల్ చేస్తున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదుగాని, నేడు ఈ వార్త పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: