టాలీవుడ్ లో కమెడియన్ గా తన ప్రస్ధానం మొదలు పెట్టిన సునీల్ ఇప్పుడు హీరోగా, కమెడియన్ గా కొనసాగుతున్నారు.  మొదట కమెడియన్ గా ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తన మేనరీజంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.  అందాలరాముడు సినిమాతో హీరోగా మారిన సునీల్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న తో మంచి విజయాన్ని అందుకున్నాడు.  అప్పటి నుంచి ఇలీవల కాలం వరుకు హీరోగా నటించాడు.  అయితే సునీల్ నటించిన మూవీస్ పెద్దగా ఆడకపోవడంతో ప్రస్తుతం కమెడియన్ గా యూటర్న్ తీసుకున్నారు. 

ఇక ‘ఆనందం’ మూవీతో హీరోగా పరిచయం అయిన ఆకాష్ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినా పేద్దగా పేరు మాత్రం తెచ్చుకోలేక పోయాడు. సీనీ పరిశ్రమలో కాంపిటిషన్ పెరగడంతో ఆకాష్ సైడైపోయాడు. అడపాదడపా సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు.  తాజాగా ‘ఇస్మార్ట్ శంకర్’ వివాదంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  ఈ మూవీ గతంలో తాను నటించిన మూవీలా ఉందని..తనకు సంప్రదించకుండా తన కంటెంట్ కాపీ చేశారని ఆరోపించారు.  ఈ క్రమంలో ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కమెడియన్ సునీల్ పై సంచలన ఆరోపణలు చేశారు. సునీల్ అందాల రాముడు మూవీలో నన్ను నటించమని బ్రతిమిలాడాడు, దాంతో ఆ సినిమాలో నటించాను కానీ నా పాత్ర నిడివి తగ్గించారని, పోస్టర్లో తన ఫోటో లేకుండా చేశారని..చివరికి సక్సెస్ మీట్ లో తన పేరు ఒక్కసారి కూడా తీసుకు రాలేదుని వాపోయారు.  సునీల్ కి కృతజ్ఞత లేదని అన్నాడు. అంతేకాదు.. సునీల్ తో కలిసి 'నవవసంతం' సినిమా చేస్తోన్న సమయంలో తనను చిన్నచూపు చూసేవాడని.. అప్పటివరకు భయ్యా అని పిలిచే సునీల్ పేరు పెట్టి పిలవడం మొదలుపెట్టాడని తెలిపాడు. అప్పుడు ఇలాంటి వారు కూడా సినీ పరిశ్రమలో ఉంటారా అని చాలా బాధవేసిందని అన్నారు ఆకాష్. 


మరింత సమాచారం తెలుసుకోండి: