సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ  , కన్నడ బ్యూటీ  రష్మిక మందన్న రెండవ సారి కలిసి నటించిన తాజా చిత్రం 'డియర్ కామ్రేడ్'.  ఇటీవల ఈ చిత్రాన్ని వీక్షించిన  బాలీవుడ్ ప్రముఖ నిర్మాత  కరణ్ జోహార్ ఈ సినిమాను  హిందీ లో రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యి  ఈ చిత్రం యొక్క  రీమేక్ రైట్స్ ను  సొంతం చేసుకున్నాడు. 


అయితే ఈ రీమేక్ పనులు ఇంకా ప్రారంభం కాలేదు అప్పుడే  ఈరీమేక్ లో  కూడా విజయ్ దేవరకొండ  నే హీరోగా నటించనున్నాడని వార్తలు వచ్చాయి. అయితే విజయ్ ఆ వార్తలను కొట్టిపారేశాడు.   ఇక  ఈ రీమేక్ లో  'ధఢక్'  పెయిర్  జాన్వీ కపూర్ , ఇషాన్ కట్టర్ ను  తీసుకొనేందుకు  కరణ్ ప్రయత్నాలు చేస్తున్నడని బాలీవుడ్  మీడియా నుండి వార్తలు వెలుబడ్డాయి.  అయితే  తాజాగా ఈ వార్తల ఫై  కరణ్ జోహార్ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. 


డియర్ కామ్రేడ్  రీమేక్ లీడ్ పెయిర్  కోసం ఇంకా ఎవరిని సంప్రదించలేదని  ప్రస్తుతానికి  ఈ రీమేక్ ప్లానింగ్ లోనే ఉందని  తెలియజేశాడు  కరణ్ జోహార్. మరి ఈ రీమేక్ లో లీడ్ పెయిర్ గా ఎవరు నటిస్తారో చూడాలి.  ఇక ఇంతకుముందు  విజయ్ దేవరకొండ  నటించిన కల్ట్ మూవీ 'అర్జున్ రెడ్డి' ,  ఖబీర్ సింగ్ గా హిందీ లో రీమేక్ అయ్యింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద  కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: