మాస్ మహా రాజా రవితేజ ,ఎక్కడికిపోతావు చిన్నవాడా ఫేమ్ వి ఐ ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తా చిత్రం 'డిస్కోరాజా'. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ తరువాత ఈ చిత్రం యొక్క తదుపరి షెడ్యూల్ ఆగస్టు 4నుండి ఢిల్లీ లో ప్రారంభం కానుంది. ఇక ఈ ఢిల్లీ షెడ్యూల్ తరువాత చిత్ర బృందం స్విజ్జర్లాండ్ కు వెళ్లనుంది.
అక్కడ జరిగే షెడ్యూల్ తో షూటింగ్ దాదాపుగా పూర్తి కానుంది. సైన్టిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తుండగా నాబా నటేష్ , పాయల్ రాజ్ పుత్ కథానాయికలుగా నటిస్తున్నారు.
ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ఫై రవి తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ కోలీవుడ్ హీరో బాబీ సింహ విలన్ పాత్రలో నటిస్తుండగా సునీల్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. దసరా కు ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకువచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఇటీవల హ్యాట్రిక్ డిజాస్టర్ లను చవి చూసిన రవితేజ కు ఈ చిత్ర విజయం కీలకం కానుంది. ఈ సినిమా తరువాత రవితేజ , 'ఆర్ ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహా సముద్రం' అనే చిత్రంలో నటించనున్నాడు.