మాస్ మహా రాజా రవితేజ ,ఎక్కడికిపోతావు చిన్నవాడా ఫేమ్  వి ఐ ఆనంద్  కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తా చిత్రం  'డిస్కోరాజా'.   ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్  హైదరాబాద్ లో జరుగుతుంది.  ఈ షెడ్యూల్ తరువాత  ఈ చిత్రం యొక్క తదుపరి షెడ్యూల్  ఆగస్టు 4నుండి  ఢిల్లీ లో ప్రారంభం కానుంది.  ఇక ఈ ఢిల్లీ షెడ్యూల్ తరువాత  చిత్ర బృందం స్విజ్జర్లాండ్ కు వెళ్లనుంది.
అక్కడ జరిగే  షెడ్యూల్ తో షూటింగ్ దాదాపుగా  పూర్తి కానుంది.   సైన్టిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న  ఈ చిత్రంలో  రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తుండగా  నాబా నటేష్ , పాయల్ రాజ్ పుత్ కథానాయికలుగా నటిస్తున్నారు. 


 ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్  బ్యానర్ ఫై  రవి తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.  ఈ చిత్రంలో ప్రముఖ కోలీవుడ్ హీరో  బాబీ సింహ విలన్ పాత్రలో నటిస్తుండగా సునీల్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. దసరా కు ఈ చిత్రాన్ని  ప్రేక్షకులముందుకు  తీసుకువచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు. 


 ఇక ఇటీవల హ్యాట్రిక్ డిజాస్టర్ లను చవి చూసిన రవితేజ కు ఈ చిత్ర విజయం  కీలకం కానుంది.  ఈ సినిమా తరువాత  రవితేజ , 'ఆర్ ఎక్స్ 100' ఫేమ్  అజయ్ భూపతి  దర్శకత్వంలో 'మహా సముద్రం' అనే చిత్రంలో నటించనున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: