టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ లో మరొక హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తరువాత, కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని సినిమాలోనే అయన నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇప్పటికే ఎన్టీఆర్, ప్రశాంత్ కాంబినేషన్లో సినిమా ఉంటుందని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నేని ప్రకటించడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఖుషి అవుతున్నారు. ఇక ఈ సినిమా మంచి మాస్ యాక్షన్ మరియు ఎంటర్టైన్మెంట్ తో సాగనున్నట్లు ఫిలిం నగర్ టాక్. ఈ సినిమాలో హీరో పాత్ర ఎంతో వీరోచితంగా ఉంటుందని, ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న కేజీఎఫ్ మూవీ తరహాలోనే హీరోయిజం ఒక రేంజిలో ఎలివేట్ చేసే సీన్స్ ఇందులో చాలానే ఉన్నాయట. 

అంతేకాక, ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ కు మరింత భారీగా మాస్ ఇమేజి రావడం ఖాయమని, అలానే ఇప్పటివరకు ఎన్టీఆర్ కి ఎంతో మాస్ ఇమేజిని తెచ్చిపెట్టిన రాజమౌళిని మించే రేంజిలో దర్శకుడు ప్రశాంత్ ఈ సినిమాలో ఎన్టీఆర్ పై యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించనున్నారట. అయితే ప్రస్తుతం ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తపై ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, ఒకవేళ ఇదే కనుక నిజం అయితే, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగే పండగ.......!! 


మరింత సమాచారం తెలుసుకోండి: