ఇటీవల అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి సక్సెస్ఫుల్ సినిమాలతో నేటి యువతతరం కలల హీరోగా కొనసాగుతున్న విజయ్ దేవరకొండ, నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమాతో మరొక సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక తొలిరోజు తొలిఆట నుండి మంచి టాక్ తో మరియు అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న ఈ సినిమాకు యువకులు మరియు ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరధం పడుతున్నట్లు చెప్తున్నారు సినీ విశ్లేషకులు. 

ఇకపోతే ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తన లేటెస్ట్ సినిమాని తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో ప్రారంభించిన విజయ్, కొద్దిరోజులు క్రితం వరకు ఆ సినిమా షూటింగ్ లోపాల్గొన్నాడు. ఇక మధ్యలో డియర్ కామ్రేడ్ ప్రమోషన్స్ నిమిత్తం ఆ సినిమా షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇవ్వడం జరిగిందట. ఇక నిన్న ఈ సినిమా విషయమై జరిగిన ఒక చర్చలో భాగంగా, ఆ సినిమాను పూర్తిగా నిలుపుదల చేయాలని దర్శక నిర్మాతలు షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. స్క్రిప్టు విషయంలో హీరో విజయ్ కు మరియు దర్శకుడు ఆనంద్ కు మధ్య కొద్దిపాటి బేధాభిప్రాయాలు రావడంతో పాటు, ఇప్పటివరకు సినిమాకు సంబంధించి చిత్రీకరించిన సన్నివేశాల తాలూకు అవుట్ పుట్ తమకు సంతృప్తిగా లేదని నిర్మాతలు తెలిపారట. 

కాబట్టి ఇక ఈ సినిమాపై డబ్బులు, సమయం ఖర్చు చేయడం వృధా అని భావించి, యూనిట్ మొత్తం సినిమా నిలుపుదల చేయాలని ఫిక్స్ అయ్యారట. విజయ్ సరసన మాళవికా మోహన్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కోసం ఇప్పటివరకు దాదాపుగా రూ.15 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు చెప్తున్నారు. మరి ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదుగాని, ఒకవేళ నిజమే అయితే మాత్రం ఒకరకంగా హీరో విజయ్ కు మరియు అయన ఫ్యాన్స్ కు ఇది చేదు వార్తే అని చెప్పాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: