ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో అనేక సినిమాలు వచ్చాయి.  అయన తీసిన సినిమాలకు మంచి క్రేజ్ ఉన్నది.  వరస హిట్స్  ఇస్తున్న దర్శకుల జాబితాలో చేరిపోయాడు.  ప్రస్తుతం ఈ దర్శకుడు సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో దర్బార్ సినిమా చేస్తున్నాడు.  ఈ మూవీపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి.  రజినీకాంత్ సినిమాలకు భారీ క్రేజ్ ఉంటుంది అనే విషయం తెలిసిందే.  


2పాయింట్ 0, పెట్ట తరువాత రజిని చేస్తున్న సినిమా.  ఏఆర్ మురుగదాస్ తో సినిమా అనే సరికి ఫ్యాన్స్ లో ఉత్సాహం మొదలైంది.  ఈ కాంబినేషన్లో ఎప్పుడో సినిమా రావాల్సి ఉన్నా కొన్ని కారణాల వలన పోస్టుపోన్ అవుతూ వస్తున్నది.  ఈసారి ఈ కాంబినేషన్లో సినిమా షురూ అయ్యింది.  


షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  ఇప్పటికే చాలా వరకు షూట్ పూర్తి చేశారు.  మరో నెలలో షూటింగ్ కంప్లీట్ చేయబోతున్నారు.  పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు అన్ని పూర్తి చేసుకొని సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  దానికోసమే షూటింగ్ చేస్తున్నారు.  చాలా కాలం తరువాత రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. సంబంధించిన  పోటోలను ఇటీవలే మురుగదాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.  


సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు కొద్దిక్షణాల్లోనే వైరల్ అయ్యాయి.  ఈ పోస్ట్ చేసి దర్బార్ పోస్టర్స్ ను  చేయాలని ట్విట్ట‌ర్ ద్వారా ఫ్యాన్స్ ను కోరారు.  దీనికి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది.  పోటీప‌డి మ‌రీ పోస్ట‌ర్స్ ను డిజైన్ చేశారు.  ఆయా డిజైన్స్ ను చూసి ద‌ర్శ‌కుడు సైతం షాక్ అయ్యాడు అంటే అర్దం చేసుకోవ‌చ్చు.  ఈ పోస్ట‌ర్స్ డిజైన్ లో అనేక పెద్ద పెద్ద సంస్థ‌లు కూడా పాలు పంచుకుంటున్నాయి.  ఇందులో కొన్నింటిని ఇప్ప‌టికే మురుగ‌దాస్ టీమ్ సెల‌క్ట్ చేసినట్టు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: