బాలయ్య కొత్త సినిమా కోసం ఇప్పటికే ఓ హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సీ కళ్యాణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు కోలీవుడ్ డైరెక్టర్ కేఎస్. రవికుమార్ దర్వకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. బాలయ్య సరసన లెజెండ్, డిక్టేటర్ సినిమాల్లో నటించిన సోనాల్ చౌహాన్ మెయిన్. ఇక రెండో హీరోయిన్ కోసం ఇప్పుడు మరో హీరోయిన్ ను కూడా ఎంపిక చేశారు.
ఆ హీరోయిన్ ఎవరో కాదు భూమిక. ఎప్పుడో సుమంత్ యువకుడు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఇన్నేళ్ల తర్వాత బాలయ్య-భూమిక కాంబోలో సినిమా రాబోతోంది. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాలో భూమికను సెకండ్ హీరోయిన్గా రవికుమార్ సెట్ చేశారట. బాబాయ్ బాలయ్య పక్కన నటిస్తోన్న భూమిక గతంలో అబ్బాయ్ ఎన్టీఆర్తో సింహాద్రి సినిమా చేసింది.
బాలయ్య-కేఎస్ రవికుమార్ సినిమాకు క్రాంతి అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ చేస్తుంటే... ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో హీరోయిన్ గా భూమిక నటించబోతోంది. చిరంతన్ భట్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ముందుగా ఈ సినిమాను బాలయ్యకు కలిసొచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు.
కథలో కొన్ని మార్పులు సూచించాడు బాలయ్య. పైగా సినిమా రెగ్యులర్ షూటింగ్ కోసం హీరో ఫిక్స్ చేసి ముహూర్తం కూడా చాలా దూరముంది. ఇక హీరోయిన్లను వెతికేందుకు చాలా టైం పట్టింది. అందుకే ఈ మూవీని సంక్రాంతి బరి నుంచి తప్పించారు. వచ్చే మార్చి లేదా ఏప్రిల్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బాలయ్య కేఎస్.రవికుమార్ కాంబో లో వచ్చిన జై సింహా సినిమా గతేడాది సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ఈ సారి కూడా వీరు వరుసగా రెండో హిట్ తమ ఖాతాలో వేసుకుంటారేమో ? చూడాలి.