ఒకవైపు సినిమాలతో అభిమానులకు వినోదాన్ని పంచుతూనే.. మరోవైపు వ్యాపారాల్లో రాణిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి దగ్గరి నుంచి లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ వరకు చాలా మంది బిజినెస్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు వ్యాపార రంగంలోకి మెలమెల్లగా అడుగుపెడుతున్నారు. ఇటీవల గచ్చిబౌలిలో విలాసవంతమైన ‘ఏఎమ్బీ’ సినిమాస్ పేరుతో ఓ మల్టీప్లెక్స్ను ప్రారంభించిన సంగతి అందరికి తెలిసిందే. అధునాతన సౌకర్యాలతో ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం జరుపుకోగా , ఇందులో మొత్తం 1638 సీటింగ్ కెపాసిటీ తో 7స్క్రీన్స్ అందుబాటులో ఉన్నాయి .కాగా, మరో రెండు రోజుల్లోనే సొంతంగా దుస్తుల బ్రాండ్ను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. కొద్ది సేపటి క్రితం టీమ్ మహేష్ బాబు ట్విట్టర్లో ఈ విషయాన్ని తెలిపింది. ‘మిమ్మల్ని ఉత్సుకతకు గురి చేసే విషయాన్ని పంచుకుంటున్నాం. ప్రస్తుతం మేం దీని పనిలోనే ఉన్నాం. సీక్రెట్ను బయటపెట్టేందుకు ఈ లింక్ను క్లిక్ చేయండి’ అంటూ
http://www.spoyl.in/mahesh-babu అనే వెబ్సైట్ను మహేశ్ బృందం పోస్ట్ చేసింది. దీన్ని మహేశ్ తిరిగి షేర్ చేశారు. ఇందులో మూడు రోజులు కౌంట్డౌన్ ఉంచారు. ఈ పేజ్లో కింది భాగంలో దుస్తుల రకాలు, బ్రాండ్లు ఉంచారు.
దీన్ని బట్టి మరో మూడు రోజుల్లో ఈ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. మరి అందులో ఎలాంటివి విక్రయానికి ఉంచుతారో చూడాలి. ఇందులో లాగిన్ అయితే మహేష్ని కలిసే ఛాన్స్ కూడా పొందవచ్చు అని తెలిపారు. రానా వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. ఆయన ముంబయిలో టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీని ప్రారంభించారు. లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కూడా సినిమాలతో పాటు వ్యాపారంపై కూడా దృష్టిపెట్టారు. రౌడీ పేరుతో దుస్తుల బ్రాండ్ను ప్రారంభించారు.