సాధారణంగా రాజకీయ నాయకుల పై స్కామ్ లకు సంబంధించిన వార్తలు వస్తూ ఉంటాయి. అయితే దీనికి భిన్నంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక వాటర్ మాఫియా మోసంలో ఇరుక్కున్నట్లు వార్తలు రావడం సంచలనంగా మారింది. ఈ విషయానికి సంబంధించిన ఒక ఆసక్తికర కథనాన్ని ఒక ఇంగ్లీష్ దినపత్రిక ప్రచురించింది.

మహేష్ నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ షూటింగ్ కాశ్మీర్ ప్రాంతంలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈసినిమాకు సంబంధించిన కొన్ని కీలకమైన వార్ సీన్స్ దర్శకుడు అనీల్ రావిపూడి చాల భారీ స్థాయిలో తీస్తున్నాడు. ఇలాంటి నేపద్యంలో అత్యంత భారీ ఖర్చుతో ఈసినిమాను తీస్తున్న ఈ యూనిట్ ను కాశ్మీర్ లో ఒక వాటర్ సప్లయర్ మోసం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

సాధారణంగా సినిమాలకు సంబంధించిన షూటింగ్ స్పాట్ లో ఆహార పదార్ధాలను వాటర్ ను సప్లయ్ చేయడానికి ఆ ప్రాంతానికి చెందిన ఒక క్యాటరింగ్ కాంట్రాక్టర్ తో ఒప్పందం కుదుర్చుకుంటారు. అయితే ఈమూవీకి సంబంధించి క్యాటరింగ్ చేసిన ఆ కాంట్రాక్టర్ మినరల్ వాటర్ అని పేరు చెప్పి ఒక ప్రముఖ మినరల్ వాటర్ పేరుతో ఉన్న టిన్స్ లో వరసగా కొన్ని రోజులు పంపు నీళ్ళు సప్లయ్ చేసాడట. 

అయితే ఈ విషయం ఈయూనిట్ కు సంబంధించిన ఒక వ్యక్తి ద్వారా లీక్ అవ్వడంతో ఆ క్యాటరింగ్ కాంట్రాక్టర్ చేసిన మోసం బయటపడినట్లు తెలుస్తోంది. దీనితో షాక్ గురైన మహేష్ తాను గత కొద్ది రోజులుగా కల్తీ వాటర్ తాగానని తెలుసుకుని భయపడి పోవడమే కాకుండా ఆ షూటింగ్ స్పాట్ కు దగ్గరలో ఉన్న ఒక ప్రముఖ డాక్టర్ దగ్గరకు వెళ్లి చెక్ చేయించుకున్నాడు అంటూ ఆకథనంలో వార్తలు వచ్చాయి అంటే కల్తీ డ్రింకింగ్ వాటర్ సమస్య మహేష్ ను కూడ ఎలా షేక్ చేసిందో అర్ధం అవుతుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: