ఫిదా సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి, తోలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. అంతేకాక తన ఆకట్టుకునే నటన మరియు డ్యాన్సులతో ఆమె యువత మనసులో మంచి స్థానాన్ని సంపాదించింది. ఆ తరువాత ఇప్పటివరకు పలు మంచి సక్సెఫుల్ సినిమాల్లో నటించిన సాయి పల్లవి, అతి త్వరలో అక్కినేని హీరో నాగచైతన్యతో కలసి మరొక్కసారి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించనుంది. 

ఇటీవల అధికారికంగా పూజ కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాను సెప్టెంబర్ లో సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా విషయమై నేడు ఒక వార్త పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతోంది. అదేమిటంటే, ఈ సినిమా కోసం నాగచైతన్య తీసుకున్న పారితోషకం కంటే సాయి పల్లవి తీసుకునేదే దాదాపుగా రెండింతలు ఉండనుందని టాక్. ఇక రెమ్యూనరేషన్ విషయమై ఇప్పటికే హీరో మరియు హీరోయిన్లను సంప్రదించిన సినిమా నిర్మాతలు, సాయి పల్లవికి ఉన్న క్రేజ్ ని బట్టి ఆమెకు చైతన్య కంటే భారీ స్థాయిలోనే ముట్టజెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. 

ఈ మ్యాటర్ తో కొంత షాక్ కు గురైన నాగచైతన్య, హీరోయిన్ గా ఆమెకున్న రేంజి అటువంటిది కాబట్టే తనకంటే మరింత పెద్ద మొత్తంలో ఆమెకు రెమ్యూనరేషన్ దక్కిందని తన సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చాడట. అయితే ఈ విషయం పై పలువురు ఆమె ఫ్యాన్స్ స్పందిస్తూ, సాయి పల్లవికి యూత్ లో, లేడీస్ లో విపరీతమైన క్రేజ్ ఉండడం, అలానే ఆమె నటించిన సినిమాల్లో చాలావరకు మంచి సక్సెస్ సాదిస్తుండడంతోనే ఆమెకు అంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు, అందులో తప్పేముంది అంటున్నారు. ఏదేమైనా హీరో గారి కంటే, హీరోయిన్ అత్యధిక స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోవడం ఒకరకంగా విడ్డూరమే అంటున్నారు సినిమా విశ్లేషకులు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: