చిరంజీవి కుటుంబ హీరోలను లెక్కేస్తే ఓ క్రికెట్ టీమ్ అవుతుందని సరదాగా అంటూంటారు అందరూ. ఇప్పటికే ఆయన కుటుంబం నుంచి వచ్చిన వారిలో కొందరు సూపర్ స్టార్లు కాగా, కొందరు హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు.  అలా ఆయన కుటుంబం నుంచి వస్తున్న మరో హీరో సాయి ధర్మ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఉప్పెన అనే పేరు కూడా పెట్టారు. హీరో కొత్తే అయినా ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. 

 

ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఓ షాక్ తగిలింది. ఈ సినిమాలో తమిళంలో వెర్సటైల్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతిని ఓ ముఖ్య పాత్రకు ఎంపిక చేశారు. దీంతో ఈ సినిమాకు మంచి హైప్ వచ్చింది. కానీ ఇప్పుడు విజయ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడనే వార్త సినిమా యూనిట్ నుంచి వస్తున్న మాట. ఇతిమిధ్దంగా కారణం తెలీకపోయినా ఇలాంటి నటుడు తప్పుకోవడం చిన్న మైనస్ కిందే లెక్క. తమిళ్ లో విజయ్ సేతుపతికి నటుడిగా చాలా పేరుంది. మాధవన్ తో చేసిన విక్రమ్ వేద విజయ్ కు చాలా పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం మెగాస్టార్ ప్రెస్టీజీయస్ మూవీ సైరాలో చాలా కీలకమైన పాత్రలో నటించాడు. 

 

సుకుమార్ రైటింగ్స్ తో ఆయన శిష్యుడు బుచ్చిబాబు సనా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మంగళూరుకు చెందిన కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా పరిచయమవుతోంది. గ్రామీణ యువతిగా తన పాత్ర ఉంటుంది. జాలరిగా నటిస్తున్ వైష్ణవ్ కు ఆమెకు ఇదే మొదటి సినిమా. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. చూద్దాం.. మరి విజయ్ సేతుపతిని ప్లేస్ ను ఎవరితో రీప్లేస్ చేస్తారో!


మరింత సమాచారం తెలుసుకోండి: