తమిళ స్టార్ హీరోలు అజిత్ , విజయ్ ల ఫ్యాన్స్ మధ్య గత కొంత కాలంగా ట్విట్టర్ వేదికగా కోల్డ్ వార్ నడుస్తుంది. అయితే ఇప్పుడు ఈ వార్ కాస్త తారాస్థాయికి చేరుకుంది. ఏకంగా విజయ్ చనిపోయాడు అంటూ #ripactorvijay అనే యాష్ టాగ్ లు జోడించి ట్విట్టర్ లో పోస్ట్ లు పెడుతున్నారు యాంటీ విజయ్ ఫ్యాన్స్. ఈ యాష్ టాగ్ ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రేడింగ్ లో కొనసాగుతుంది. ఈ ట్యాగ్ చూసి విజయ్ అభిమానులు షాక్ అయ్యారు. ఇది అజిత్ ఫ్యాన్స్ నిర్వాకమే అని మరి ఇంతకు దిగజారిపోయి ఇంతలా నెగిటివ్ ప్రచారం చేస్తారనుకోలేదని విజయ్ అభిమానులు మండిపడుతున్నారు.
ఈ యాష్ ట్యాగ్ ను చూసిన నెటిజన్లు విజయం తో వారికి బుద్ది చెప్పు నీకు ఎల్లప్పుడూ అండగా మేముంటాం అంటూ #ignorenegitivity #longlivevijay అనే ట్యాగ్ లను జోడించి విజయ్ కి భారీ సంఖ్యలో ట్విట్టర్ ద్వారా మద్దతు పలుకుతున్నారు. కాగా టాలీవుడ్ నుండి మహేష్ బాబు , ఎన్టీఆర్ , అల్లు అర్జున్ , ప్రభాస్ ఫ్యాన్స్ కూడా విజయ్ కు మద్దతు తెలుపుతూ సపోర్ట్ చేస్తున్నారు. ఇక #ripactorvijay అనే యాష్ ట్యాగ్ ఫై ప్రముఖ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఇప్పటికే మన భూగ్రహాన్ని ఓ గ్రహ శకలం ఢీ కొట్టింది. ఋతుపవనాలు లేక కొన్ని నగరాలు కరువు కోరల్లో చిక్కుకున్నాయి . ఇలాంటి పరిస్థుతుల్లో ఈ పిచ్చి యాష్ ట్యాగ్ లతో జనాలు అయోమయానికి గురి చేయడం ఏంటని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించాడు.
అయితే విజయ్ ఇటీవల వరుస విజయాలతో తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు. అది చూసి ఓర్వలేక అజిత్ ఫ్యాన్స్ ఇలా విజయ్ ఫై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని విజయ్ ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఇప్పటికైనా అజిత్ , విజయ్ తమ ఫ్యాన్స్ తో మాట్లాడి వివాదాలను పరిష్కరించుకుంటే మేలు.