మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా మరోసారి కాజల్ ఎంపిక అయిందా.. అంటే అవుననే సమాధానం ఫిల్మ్ నగర్ లో చక్కర్లుకుడుతోంది. రెండేళ్ల క్రితం వీరిద్దరి జోడీ ఖైదీనెం.150 సినిమాలో కనువిందు చేసింది. మళ్లీ ఇప్పుడు కొరటాల శివ తో చేస్తున్న చరంజీవి 152వ సినిమాకు కాజల్ ను ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి.

 

ఈ సినిమాలో హీరోయిన్ కోసం నయనతార, తమన్నా పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. నయనతార ఇప్పటికే సైరాలో నటించింది. వెంటనే ఈ కాంబో రిపీట్ అయితే ప్రేక్షకులు బోర్ ఫీలవుతారా అనే కోణంలో ఆలోచిస్తోందట యూనిట్. ఇంకా తమన్నా పేరు కూడా పరిశీలిస్తున్నారు. తమన్నా కూడా సైరాలో నటించింది. కాజల్ అయితే ఈ కాంబో వచ్చి రెండేళ్లు దాటింది కాబట్టి పెద్దగా మొనాటనీ రాదని మరో ఆలోచనలో ఉందట యూనిట్. వీరితో పాటు శృతిహాసన్ పేరు కూడా పరిశీలనకు వచ్చిందట. అయితే చిరంజీవి పక్కన శృతిహాసన్ మరీ తేలిపోతుందేమోనని మేకర్స్ సందేహం. ప్రస్తుతానికి ఈ విషయంపై క్లారిటీ లేదు కానీ ఫైనల్ గా మెగాస్టార్ పక్కన కాజల్ ఫిక్స్ అయ్యే అవకాశాలే ఉన్నాయని సమాచారం.

 

సీనియర్ హీరోల పక్కన హీరోయిన్ల కొరత ఎక్కువగానే ఉంది. వెంకటేశ్, బాలకృష్ణ, నాగార్జున కూడా హీరోయిన్ల కోసం వెతుకులాడాల్సిన పరిస్థితి. శ్రియకు పెళ్లైంది. అనుష్క వీరి పక్కన సరిపోతున్నా సెలక్టివ్ గా సినిమాలు చేస్తూండటంతో అనుష్క దొరకడం కష్టంగా మారింది. నయనతార ఫుల్ బిజీ. దాంతో ఆమె డేట్స్ దొరకడం కష్టం. దీంతో కాజల్, తమన్నా ఆప్షన్స్ గా కనపడుతున్నారు. తమన్నా వెంకీతో ఎఫ్2లో సరిగ్గా సరిపోయింది. చూడాలి మరి మెగాస్టార్ పక్కన ఆడిపాడబోయేదెవరో. ఆగష్టు మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: