సాధారణంగా సెలబ్రెటీలు అంటే సామాన్య ప్రజలకు కాకుండా వారికంటూ ఓ ప్రత్యేకత ఏర్పాటు చేసుకుంటారని అర్థం. ముఖ్యంగా సినీ, క్రీడా, రాజకీయాల్లో పాపులారిటీ తెచ్చుకున్న వారికి ప్రజల్లోఎంతో ఆదరణ ఉంటుంది. అయితే అలాంటి వారిపైనే ఎక్కువ రూమర్లు కూడా ఉంటాయి. తెలుగు లో బద్రి సినిమాతో డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లోకి వచ్చిన పూరి జగన్నాధ్ ఇప్పుడు ఎంత పాపులర్ దర్శకులో అందరికీ తెలిసిందే. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రియ శిష్యుడుగా మెలిగి తానే స్వయంగా డైరెక్షన్ చేస్తానని ‘బద్రి’సినిమాతో తన సత్తా చాటాడు.
ఆ తర్వాత ఇడియట్, పోకిరి, చిరుత ఇలా సూపర్ హిట్ సినిమాలు తీసి తనకంటూ ప్రత్యేక ట్రెండ్ సృష్టించికున్నాడు. టెంపర్ తర్వాత వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న పూరికి ‘ఇస్మార్ట్ శంకర్’తో వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. ఫ్యాన్స్ పూరి ఈజ్ బ్యాక్ అంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లడుతూ.. ఇస్మార్ట్ శంకర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు. ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పూరి జగన్నాధ్ తన వ్యక్తిగత విషయాలని కూడా పంచుకున్నాడు. 2017లో డ్రగ్స్ ఉందంతం తెలుగు చిత్ర పరిశ్రమని కుదిపేసింది.
ఈ కేసులో పోలీసులు పలువురు సినీ ప్రముఖుల్ని విచారించారు. అందులో పూరి జగన్నాధ్, చార్మి కూడా ఉన్నారు. అయితే ఈ కేసులో చాలా సేపు పూరి, ఛార్మిని ఇంటరాగేటషన్ చేయడంతో మీడియాలో రక రకాల కథనాలు వచ్చాయని అన్నారు. అంతేకాదు మీడియాలో వస్తున్న గాసిప్స్ మరింత హాట్ టాపిక్ గా మారాయి. ఇలాంటి విషయాలు నేను కామన్ గా తీసుకుంటాను..కానీ నా కుటుంబ సభ్యులు మాత్రం జీర్ణించుకోలేక పోయారు. ముఖ్యంగా నా భార్య ఈ విషయం నాతో ప్రస్తావించి కంటతడి పెట్టింది. అది నా గుండెను ఎంతో గాయం చేసినట్లయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు పూరి.