ఇక జాలర్ల నేపథ్యంలో తెరకెక్కతున్న ఈచిత్రంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ రోల్ లో నటిస్తున్నాడు.దాంతో సినిమా ఫై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే విజయ్ ఈ చిత్రం నుండి తప్పుకున్నాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. ఈ వార్తల గురించి చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ స్పందిస్తూ సినిమా నుండి విజయ్ సేతుపతి తప్పుకున్నాడనే ప్రచారం జరుగుతుంది వాటిని నమ్మొద్దు అవన్నీ రూమర్లే ఆగస్టు 16నుండి జరిగే షెడ్యూల్ లో విజయ్ సేతుపతి ఉప్పెన షూటింగ్ లో జాయిన్ కానున్నడని అలాగే సినిమా కూడా బాగా వస్తుంది అని క్లారిటీ ఇచ్చింది.
ప్రముఖ దర్శకుడు సుకుమార్ సొంత నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ కూడా ఈ చిత్ర నిర్మాణం లో భాగస్వామిగా వ్యవహరిస్తుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా వైష్ణవ్ కు జోడీగా కృతి శెట్టి నటిస్తుంది. తెలుగులో ఆమెకు ఇదే మొదటి సినిమా. ఇక విజయ్ సేతుపతికి తెలుగులో ఇది రెండవ సినిమా. ప్రస్తుతం ఈ సినిమాతో పాటు ఆయన , మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పీరియాడికల్ మూవీ 'సైరా' లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇవి గాక విజయ్ తమిళంలో అరడజను కు పైగా సినిమాలతో ఫుల్ బిజీ గా వున్నాడు.