బాహుబలి 2 తర్వాత యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న మూవీ ‘సాహూ’.  ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టి రెండు సంవత్సరాలు కావొస్తుంది.  అయితే ప్రభాస్ అభిమానులకు ఏ రేంజ్ సినిమా కావాలో ఆ స్థాయిలో సినిమా రూపొందుతుందని చిత్ర యూనిట్ అంటున్నారు. రూ.250 కోట్లతో ఈ మూవీ నిర్మితమవుతుంది. ఇప్పటి వరకు టాలీవుడ్ లో కనీ వినీ ఎరుగని రీతిలో యాక్షన్ సీన్లు ఈ మూవీలో ఉండబోతున్నాయట. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన బాలీవుడ్ అందాల తార శ్రద్దా కపూర్ నటిస్తుంది.

మరో ముఖ్యపాత్రలో బాలీవుడ్ నటులు నటిస్తున్నారు. అయితే ఈ మూవీపై గత కొంత కాలంగా ఎలాంటి అప్ డేట్స్ లేకపోవడంతో ఎన్నో అనుమానాలు వచ్చాయి.  దాంతో అలర్ట్ అయిన చిత్ర యూనిట్ వరుసగా అప్ డేట్స్ ఇవ్వడం మొదలు పెట్టింది. ఇప్పటికే పోస్టర్స్, టీజర్, లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి.

ఈ క్రమంలో ఈ సినిమా నుంచి ఒక పాట టీజర్ ను విడుదల చేశారు. “నిన్నను మరిచేలా నిను ప్రేమిస్తాలే .. నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే’ అనే సాంగ్ బిట్ ను విడుదల చేశారు.  ప్రభాస్ , శ్రద్ధా కపూర్ కాంబినేషన్లో విదేశాల్లోని అందమైన లొకేషన్స్ లో ఈ సాంగ్ ను షూట్ చేశారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ఈ పాట టీజర్‌ను విడుదల చేశారు.

ప్రభాస్ - శ్రద్ధా కపూర్ కాంబినేషన్లో విదేశాల్లోని అందమైన లొకేషన్స్ లో ఈ సాంగ్ ను చిత్రీకరించారు. ఈ సాంగులో ప్రభాస్ మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తుండగా.. శ్రద్ధా కపూర్ కూడా మరింత గ్లామరస్ గా కనువిందు చేస్తోంది. ఆగస్టు 2వ తేదీన పూర్తి సాంగును విడుదల చేయనున్నారు. ఈ మెలోడియస్ గీతానికి మంచి మార్కులే పడతాయనిపిస్తోంది. ఈ సినిమాను వచ్చే నెల 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: