పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ తరువాత మరింత రెచ్చిపోతున్నారు. ఇప్పటికే సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా రూ. 30 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసింది. ఈ మధ్యకాలంలో భారీ వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. మీడియం రేంజ్ సినిమాగా వచ్చి పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి భారీ సక్సెస్ సాధించింది. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా కూడా పెద్ద లేదని తేలిపోవడంతో ఈ మూవీకి కలెక్షన్ల వర్షం కురుస్తూనే ఉన్నది.
ఈ సినిమా మంచి హిట్ కొట్టడంతో.. పూరి తన నెక్స్ట్ సినిమాపై దృష్టి పెట్టాడు. ఎప్పటి నుంచి తాను అనుకుంటున్న జనగణమన సినిమాను తెరపైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. ఎలాగో సొంత నిర్మాణ సంస్థ ఉన్నది. మరో నిర్మాతగా ఛార్మి ఉన్నది. ఇప్పుడు సొంతంగానే సినిమాలు తీస్తున్నారు. యూనిట్ మారదు. మారేదల్లా కథ, నటీనటులు మాత్రమే. ఇస్మార్ట్ శంకర్ హిట్ అయ్యాక పూరి తో సినిమాలు చేసేందుకు యువ నటీనటులు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇందులో కేజీఎఫ్ హీరో యాశ్ కూడా ఉన్నారని తెలుస్తోంది. యాశ్ హీరోగా చేసిన కేజీఎఫ్ సినిమా ఏ రేంజ్ లో హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. సినిమా బంపర్ హిట్ కొట్టడంతో.. కేజీఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ నవంబర్ తో పూర్తవుతుంది. నవంబర్ తో పూర్తయ్యాక పూరితో సినిమా చేసే అవకాశం ఉంటుంది. అయితే, పూరి సినిమా అనుకుంటే చాలా స్పీడ్ గా తెరకెక్కిస్తారు.
మరోవైపు పూరి జగన్నాధ్ బాలకృష్ణతో సినిమా చేసేందుకు కూడా రెడీగా ఉన్నారు. బాలయ్యతో సినిమా కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలం అవుతాయో చూడాలి. ఇస్మార్ట్ శంకర్ హిట్టయితే సినిమా చేద్దామని పూరితో బాలయ్య చెప్పిన సంగతి తెలిసిందే కదా. ఇస్మార్ట్ హిట్ కొట్టింది. మరి బాలయ్య ఇచ్చిన మాటను నిలుపుకుంటాడా చూడాలి.