బిగ్ బాస్ ఈ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెర 'స్టార్ మా'లో ప్రసారమయ్యే ఈ రియాలిటీ షో ఇప్పటికే సీజన్ 1, 2 సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకొని ఎన్నో వివాదాల మధ్య గతవారం షో ప్రారంభమయ్యింది. వచ్చిన 15 కంటస్టెంలలో హేమ అక్క డామినేషన్ తట్టుకోలేక అక్కని ఎలిమినేట్ చేసి బయటకు పంపించేశారు. 


దీంతో హేమ అక్క స్థానంలో వైల్డ్ కార్డ్ కంటస్టెంట్ గా 'తమన్నా సింహాద్రి'ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. ఆమె కూడా బాగా హుషారుగా ఉంది. అందుకే రాగానే గతవారంలో జరిగిన మహేష్ విట్టా, వరుణ్ సందేశ్, వితికా గొడవల గురించి మాట్లాడింది. ఆ గొడవలలో వితికదే తప్పు అని మహేష్ కరెక్ట్ అని వెనుకేసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ రెండోవా వారం నామినేషన్ సభ్యుల పేర్లు చెప్పాలని అడిగారు. 


ఈ లిస్ట్ లో మొదట శ్రీముఖి ఉండగా హిమజ సెకండ్ ఉంది. అయితే వితిక మాత్రం ఆమె చేసిన తప్పు వల్ల నామినేషన్ సభ్యుల పేరు చెప్పే ఛాన్స్ పోగుట్టుకుంది. ఈ తరహాలోనే తమన్నా సింహాద్రిని ఎవరిని ఎలిమినేట్ చెయ్యాలనుకుంటున్నారు అని అడగగా ఆమె వితిక, వరుణ్ సందేశ్ పేర్లను చెప్పి వారిని ఎలిమినేట్ లిస్ట్ లోకి చేర్చింది. అయితే ఇందులో రవి కిరణ్, రోహిణి పేర్లు ఉండకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.


ఇవి అన్ని పక్కన పెడితే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వార్త హల్ చల్ చేస్తుంది. ఆ వార్త ఏంటంటే అనుష్క బిగ్ బాస్ హౌస్ లోకి రానున్నదని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 1 లో విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చి అలరించగా, సీజన్ 2 లో యాంకర్ ప్రదీప్, రానా వచ్చి బుల్లితెర ప్రేక్షకులను, బిగ్ బాస్ కాంటస్టెంట్లను ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ నేపథ్యంలోనే సీజన్ 3 కోసం ప్రత్యేకంగా 'అనుష్క శెట్టి' రానున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి నిజంగా అనుష్క బుల్లితేరాకు వస్తారా లేక ఇది పుకారా అనేది తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: