బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా రమేష్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం "రాక్షసుడు".  తమిళంలో  విజయవంతమైన "రాక్షసన్" చిత్రానికి తెలుగు రీమేక్ గా కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు.  సైకో కిల్లర్ కథాంశంతో క్రైమ్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమా ఆగష్టు 2న రిలీజ్ కానుంది.  కాగా  ఈ సందర్భంగా ఈ సినిమా  ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘ‌నంగా జరువుకుంది.  ఈ ఈవెంట్ లో చిత్రబృందంతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి,  బెల్లంకొండ సురేష్ తదితరులు హాజరయ్యారు. 


కాగా ఈ ఈవెంట్ లో  అనిల్ రావిపూడి మాట్లాడుతూ..  కందీరీగకి పనిచేస్తున్నప్పుడు బెల్లంకొండ సురేష్ గారు నన్ను డైరెక్టర్ ను చేయాలనుకున్నారు. ఆయనంటే నాకు అభిమానం. సాయి  ప్రతి సినిమాకి కొత్తగా ట్రై చేస్తున్నాడు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు.   హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. నా కెరీర్ లో మీరు (ప్రేక్షకులను ఉద్దేశిస్తూ)   నాకు ఎంతో సపోర్ట్ చేశారు. థాంక్ యు. ఇంత మంచి స్క్రిప్ట్ లో నన్ను భాగం చేసినందుకు సత్యనారాయణ గారికి థాంక్స్. రమేష్ గారు చాలా ఇష్టపడి, కష్టపడి ఈ సినిమా చేశారు. ఈ సినిమాని మీ అందరికీ నచ్చుతుంది అన్నారు.   


 బెల్లంకొండ సురేష్  మాట్లాడుతూ.. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అయ్యి సాయి శ్రీనివాస్ అందరి అభిమానం చూరగొంటాడు. రాబోయే సినిమాలు కూడా ప్రేక్షకులని అలరించేలా ఉంటాయి. రాక్షసుడు టీం కి ఆల్ ద బెస్ట్  అని అన్నారు.  హీరోయిన్ అనుపమా పరమేశ్వన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ సత్యనారాయణ గారు, హవిష్ గార్లకు థాంక్స్ అని అన్నారు. 


ఇక సైకో కిల్లర్ కథాంశంతో క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. బెల్లంకొండ శ్రీనివాస్ సైకో కిల్లర్ కేసు ని ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ పాత్రలో కనిపిస్తున్నారు.  మొత్తానికి సైకో కిల్లర్ ను పట్టుకునే ఇన్వెస్టిగేట్  క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండనుంది.  ఇక ఇటీవలే విడుదలైన  ట్రైలర్ ఆసక్తిరంగా ఉండటంతో  సినిమా ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది.  'ఏ స్టూడియోస్', అభిషేక్ పిక్చర్స్ సంయుక్తంగా  నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం జిబ్రాన్ అందిస్తున్నారు. 


ఇక  సైకో కిల్లర్ కథాంశంతో క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. బెల్లంకొండ శ్రీనివాస్ సైకో కిల్లర్ కేసు ని ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ పాత్రలో కనిపిస్తున్నారు.  మొత్తానికి సైకో కిల్లర్ ను పట్టుకునే ఇన్వెస్టిగేట్  క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండనుంది.  ఇక ఇటీవలే విడుదలైన  ట్రైలర్ ఆసక్తిరంగా ఉండటంతో  సినిమా ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది.  'ఏ స్టూడియోస్', అభిషేక్ పిక్చర్స్ సంయుక్తంగా  నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం జిబ్రాన్ అందిస్తున్నారు.    
ఇక  సైకో
ఇక  సైకో

మరింత సమాచారం తెలుసుకోండి: