బిగ్ బాస్ సీజన్ 3లో క్రేజీ కపుల్స్ గా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్, వితిక ఇద్దరు కలివిడిగా ఆట ఆడుతూ సరదాగా గడుపుతున్నారు. లాస్ట్ వీక్ వితికను ఏదో అన్నాడని మహేష్ విట్ట మీద గొడవకు దిగాడు వరుణ్ సందేశ్ దాని వల్ల అతని మీద ఓ నెగటివ్ మార్క్ పడ్డది. ఒకసారి మందలించి ఆ తర్వాత అది రిపీట్ చేస్తే సీరియస్ అయితే బాగుండేది కాని వరుణ్ సందేశ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు.


ఆ తర్వాత రోజే మహేష్ వచ్చి వరుణ్ సందేశ్ కు సారీ చెప్పడంతో ఆ గొడవకు ఎండ్ కార్డ్ పడ్డది. ఇక సెకండ్ వీక్ లోకి వచ్చాక హేమ ఎలిమినేట్ అవగా ఆమె స్థామలో తమన్నా సింహాద్రి హౌజ్ లోకి వచ్చింది. వారం పాటు షో చూసిన ఆమె వచ్చి రాగానే వరుణ్ సందేశ్ పై నెగటివ్ ప్రచారం మొదలు పెట్టింది. మహేష్ విట్ట మర్చిపోయిన ఆ గొడవని గుర్తుచేసి మరి రెచ్చగొట్టింది.  


ఇక మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో ఇంటి సభ్యులకు నీళ్లు, గ్యాస్ కట్ చేశాడు బిగ్ బాస్. నీరు అవసరాన్ని తెలియచేసేలా వారికి ఓ టాస్క్ ఇచ్చి అది ఫినిష్ చేస్తే లక్సరీ బడ్జెట్ ను రిలీజ్ చేస్తానని చెప్పాడు బిగ్ బాస్. అయితే దానికోసం నిరంతరాయంగా సైకిల్ తొక్కుతూనే ఉండాలి. గ్యాస్ కోసం ఒక సైకిల్.. వాటర్ కోసం ఒక సైకిల్.. హౌస్ గురించి ఓ సైకిల్ తొక్కాల్సి ఉంటుంది. 


ఈ క్రమంలో వంట గదిలో డ్యూటీ చేస్తున్న వితిక తను ఆ డ్యూటీ చేస్తుంది. అయితే మరోపక్క అందరు సైకిల్ తొక్కుతూ ఉన్నారు. ఈలోగా పునర్నవి వచ్చి వితికని సైకిల్ తొక్కమని చెప్పింది. అదే పెద్ద గొడవకు దారి తీసింది. పునర్నవి చెప్పిన మాటల్లో వాస్తవం ఉండటం వల్ల వరుణ్ సందేశ్ కూడా ఆమెకు సపోర్ట్ ఇచ్చాడు. ఇక దానితో వితిక ఏడ్చుకుంటూ బాత్ రూంలోకి వెళ్లింది. అయితే ఫైనల్ గా ఎలాగోలా గొడవ సర్ధుమనిగింది.. కాని బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్క్ వల్ల వరుణ్, వితికల మధ్య దూరం పెరిగింది.        



మరింత సమాచారం తెలుసుకోండి: