ప్రస్తుతం టెలివిజన్ రంగంలో ‘జబర్ధస్త్’ కామెడీ షోకి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.  ఈ ‘జబర్ధస్త్’ కామెడీ ఎంతో మంది కమెడియన్లు తమ సత్తా చాటుతూ వెండి తెరపై కూడా వెలిగిపోతున్నారు.  ఇప్పటికే ధన్ రాజ్, వేణు, తాగుబోతు రమేష్ లు కమెడియన్లుగా వస్తుండగా, సుదీర్, చమ్మక్ చంద్ర,గెటప్ శీను ఇలా కొంత మంది కమెడియన్లుగా నటిస్తున్నారు. 

ఇక షకలక శంకర్ అయితే కమెడియన్ గా ప్రస్థానం మొదలు పెట్టి ఇప్పుడు హీరోగా నటించే స్థాయికి ఎదిగాడు.  శ్రీ‌కాకుళం యాస‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ క‌మెడియ‌న్. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ భ‌క్తుడిగా కూడా ఈయ‌న‌కు స‌ప‌రేట్ ఇమేజ్ ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తనకు జబర్దస్త్ తల్లి లాంటి షో, అక్కడ నుంచి రావడం తనకు కూడా ఇష్టం లేదని.. కానీ కొన్ని పరిస్థితులు అలా వస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారంటున్నాడు. 

తాను జబర్ధస్త్ లో ఉన్న సమయంలో ఎన్నో వెరైటీ స్కిట్స్ చేశానని అప్పట్లో తను తెగ మెచ్చుకున్నారని అన్నారు.  కానీ కొత్త కొత్త స్కిట్స్ చేయాలంటే సమయం దొరక  అవే స్కిట్స్ తర్వాత రీమేక్ చేస్తే తిట్టుకున్నారని చెప్పాడు శంకర్.  అందుకే తను కొత్తగా ట్రై చేయలేక.. ఉన్నవి రీమేక్ చేయలేక మానేసానంటున్నాడు.

ఈ షోలో స్కిట్స్ చేయడానికి తనకు టాలెంట్ లేదని అర్థం అయిందని చెప్పాడు షకలక శంకర్. కొందరు ఇప్పటికీ అక్కడ ఉన్నారంటే అది వాళ్ల టాలెంటే అంటున్నాడు.  శకలక శంకర్, శ్రీ‌ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో శంభో శంక‌ర సినిమా చేసాడు ఈయ‌న‌. ఈ సినిమా డిజాస్ట‌ర్  అయ్యింది. ఆ త‌ర్వాత డ్రైవ‌ర్ రాముడు అనే సినిమా మొద‌లుపెట్టి ఆపేసాడు. ఇక మొన్న‌టికి మొన్న నాలుగో సింహం అంటూ మ‌రో సినిమాతో బిజీ అయ్యాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: