నాగార్జున్ హోస్ట్‌గా ఉన్న బిగ్ బాస్ సీజన్ 3 మొద‌టి వారం పూర్తి చేసుకుని రెండో వారంలోకి అడుగుపెట్టింటి. 15 మంది కంటెస్టెంట్స్‌లో హేమ తొలి ఎలిమినేషన్ కాగా.. వైల్డ్ కార్డ్‌తో హౌస్‌లోకి తమన్నా సింహాద్రి ఎంట్రీ ఇచ్చింది. అయితే మ‌రో వైల్డ్ కార్డ్ ద్వారా స్టార్ హీరోయిన్‌ రాబోతుంది. ఇప్పుడేగా ఒక ఎంట్రీ అయింది.. మ‌ళ్లీనా అనుకుంటున్నారా? నిజానికి బిగ్ బాస్ ప్రతి సీజన్ లో కూడా సినిమాల ప్రమోషన్ చేస్తూ వస్తున్నారు. ఇదే క్ర‌మంలో హోస్టుగా ఉన్న నాగార్జున.. దీన్ని తన సినిమా కోసం కూడా వాడుకోవాలని చూస్తున్నాడు.


తాజాగా రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంతో నాగార్జున ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టిస్తున్న సినిమా మ‌న్మ‌థుడు 2. మ‌న్మ‌థుడుకు సీక్వ‌ల్ వ‌స్తున్న ఈ సినిమా ఆగస్ట్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్నింటికి మించి ఇందులో నాగ్ లుక్స్, స్టైల్స్ అద‌ర‌గొట్టాడు. ఇప్పటికే మన్మధుడు 2 శాటిలైట్.. హిందీ డబ్బింగ్ రైట్స్.. డిజిటల్ రూపంలో 22 కోట్ల మేర నాన్ థియేట్రికల్ బిజినెస్ సాగింది. ప్ర‌స్తుతం ఈ సినిమాకు మ‌రింత క్రేజ్ తెచ్చుకునేందుకు బిగ్ బాస్ హౌజ్‌లో ప్ర‌మోట్ చేయాల‌ని చూస్తున్నారు.  


ఈ క్ర‌మంలోనే ర‌కుల్ ప్రీత్ సింగ్‌తో క‌లిసి నాగార్జున కూడా ఇంట్లోకి వెళ్లి మన్మధుడు 2 ప్రమోషన్స్ నిర్వహించాలని భావిస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.  గత సీజన్స్‌లో హీరోలు కూడా తమ సినిమాలు చేసుకుంటూ.. వాటిని బిగ్ బాస్ హౌజ్‌లో ప్రమోట్ చేసుకున్నారు. ప్ర‌స్తుతం నాగార్జున కూడా ప‌క్కా బిజినెస్ స్ట్రేట‌జీతో ర‌కుల్‌ని ఇంట్లోకి తీసుకువెళ్లి ప్ర‌మోష‌న్లు జ‌రుపుకోవాల‌ని చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. వీకెండ్స్ లో అయితే రకుల్ ఇంట్లోకి వెళ్లే అవకాశం ఉండదు. అందుకే వీక్ డేస్ లోనే ఒక రోజు రకుల్ ను ఇంట్లోకి వెళ్లి సంద‌డి చేయ‌బోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: