బాలీవుడ్లో ‘ఫగ్లీ’ సినిమాతో తెరంగేట్రం చేసిన కియారా అద్వానీ.. ఆ తర్వాత భారత మాజీ క్రికెటర్ ‘ఎం.ఎస్.దోని’ జీవిత కథపై తెరకెక్కించిన ‘ఎం.ఎస్.దోని ది అన్టోల్డ్ కహాని’ సినిమాతో కథానాయికగా బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత తెలుగులో మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది.
ఆ సినిమా సక్సెస్ తర్వాత.. రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’లోనూ తన అంద చందాలతో బాగానే ఆకర్షించింది. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఎక్కడ ఆఫర్ వస్తే అక్కడ నటించేందుకు ఓకే చెబుతోన్న ఈ అమ్మడు ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో షాహిద్ కపూర్ హీరోగా నటించిన ‘కబీర్ సింగ్’ సక్సెస్ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. ఈ సినిమా సక్సెస్తో బాలీవుడ్లో ఫుల్ బిజీ అయిపోయింది.
ప్రస్తుతం హీరోయిన్గా పీక్ స్టేజ్లో ఉన్న కియారా కెరీర్ మొదట్లో కథానాయికగా పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చింది. హీరోయిన్గా ఆమె నటించిన ఫస్ట్ మూవీ ‘ఫగ్లీ’. 2014లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఈ సినిమా ఫ్లాప్ తర్వాత హీరోయిన్గా తనకు అవకాశాలు రాలేదని చెప్పుకొచ్చింది. కెరీర్లో గ్యాప్ రావడం వల్ల తనకు మంచే జరిగిందన్నారు.
ఈ సినిమా తర్వాత పలువురు దర్శకులని కలిసి సినిమాల్లో అవకాశం ఇవ్వమని నేను ఎంతో మంది దర్శకులని కలిసాను. ఐనా తమ సినిమాల్లో నన్నుమాత్రం తీసుకునే వారు కాదు. ఆ తర్వాత నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎం.ఎస్.ధోని’ సినిమా తనకు హీరోయిన్గా బ్రేక్ ఇచ్చిందన్నారు.
ఆ తర్వాత చేసిన ‘మెషిన్’ సరిగా నడవలేదు. కానీ ఈ సినిమాలో ‘చీజ్ బడీ’ పాట అందరి దృష్టిలో పడింది. ఆ తర్వాత తెలుగులో మహేష్ బాబుతో చేసిన ‘భరత్ అను నేను’ సినిమాతో నా కెరీర్ గాడిన పడింది. నిజానికి సౌత్ సినిమాలతోనే నేను హీరోయిన్గా నిలదొక్కుకున్ననని చెప్పుకొచ్చారు.
ఇక బాలీవుడ్లో చేసిన ‘లస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్ నా కెరీర్కు బాగానే ఉపయోగపడిందన్నారు. ప్రస్తుతం ఈ భామ ‘కబీర్ సింగ్’ సక్సెస్ను ఎంజాయ్ చేస్తోన్న కియారా..అక్షయ్ కుమార్ సరసన ‘గుడ్ న్యూస్’తో పాటు ‘లక్ష్మీ బాంబ్’ సినిమాల్లో కథానాయికగా నటిస్తోంది. దాంతో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్స్లో కియారానే హీరోయిన్గా అనుకుంటున్నారు.