మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో “ఖైదీ నంబర్ 150” తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. యాక్షన్ సినిమాలతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ ను సృష్టిం చిన దర్శకుడు వి వి వినాయక్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయం సాధించడమే కాకుండా, 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. చిరంజీవి 150వ సినిమాగా వచ్చిన “ఖైదీ నంబర్ 150” లో ఆయన “అందరివాడు” సినిమా తరువాత మరో సారి డ్యూయల్ రోల్ లో నటించారు. ఐతే ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్ కానుందని బాలీవుడ్ మీడియా లేటెస్ట్ అప్‌డేట్.

అక్షయ్ కుమార్ హీరోగా జగన్ శక్తి దర్శకత్వంలో “ఇక్కా” పేరుతో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఈ విషయాన్నీ దర్శకుడు జగన్ శక్తి స్వయంగా తెలిపారు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన “మిషన్ మంగళ్” ఆగస్టు 15న విడుదల కానుండగా,మరో కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. “మిషన్ మంగళ్” సినిమా సమయంలోనే ఈ 150 గురించి చర్చలు జరపడం జరిగిందన్న జగన్ శక్తి అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాం అని అన్నారు. గతంలో జగన్ శక్తి చీనీ కమ్, ఇంగ్లీష్ వింగ్లిష్, పా..వినూత్నమైన సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు, “మిషన్ మంగళ్” దర్శకుడిగా బాలీవుడ్ లో ఆయనకు మొదటి సినిమా.

ఇక ఖైదీ నంబర్ 150 తమిళ సినిమా “కత్తి”కి తెలుగు రీమేక్. మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా 2014లో విడుదలైన ఈ సినిమా కోలీవుడ్ లో మంచి కమర్షియల్ సక్సస్ ను అందుకుంది. అంతేకాదు గతంలో మురుగదాస్, విజయ్ కాంబినేషన్ లో వచ్చిన తుపాకీ సినిమాని అక్షయ్ హాలిడే పేరుతో హిందీలో రీమేక్ చేసి కమ్ర్షియల్ సక్సస్ అందుకున్నారు. ఇక బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ గత రెండేళ్ళుగా వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకుంటూ రేస్ లో అందరికంటే ముందున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: