మెగస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న సైరా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ స్పీడ్ గా సాగుతున్నాయి. దసరా సెలవులకు సినిమా రెలీజ్ కాబోతున్నది. మహాత్మాగాంధి జయంతి రోజున అంటే అక్టొబర్ 2 వ తేదీన సినిమాను రెలీజ్ చేస్తున్నారు. ఆగస్టు 22 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి ప్రకటిస్తారట. అదే రోజున మెగస్టార్ కొత్త సినిమా ప్రారంభం అవుతుంది. అయితే, ఈ సినిమాలో మెగస్టార్ తో పాటు, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కుడా నటిస్తున్నారని సమాచారం.
కొరటాల శివ అతిధి పాత్ర గురించి చరణ్ తో చర్చించారని, ఆ పాత్రలో నటించేందుకు చరణ్ కూడా ఒకే చెప్పారని సమాచారం. గతంలో మగధీర, బ్రూస్ లీ, ఖైదీ నెంబర్ 150 సినిమాల్లో మెగాస్టార్, చరణ్ లో స్క్రీన్ పై కనిపించారు. ఇద్దరు కలిసి నటిస్తే ఇది నాలుగో సినిమా అవుతుంది.
స్టార్ హీరోలు తమ కుమరులతో కలిసి ఒకటి రెండు సినిమాల కంటె ఎక్కువ సినిమాల్లో కనిపించిన దాఖలాలు లేవు. చిరంజీవి, రాం చరణ్ లు కలిసి ఇప్పటికే మూడు సినిమాలు చేశారు. ఈ బంపర్ హిట్ అయ్యాయి. నాలుగో సినిమా కూడా హిట్ అయితే, ఈ మెగా అనుబంధానికి తిరుగుండదు. మెగాస్టార్ నటించే సినిమాలకు రాం చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై సినిమాలు తీస్తున్నారు.
కొరటాల శివ దర్శకుడు. సమాజానికి ఉపయోగపడే సున్నితమైన కథాంశంతో సినిమా తెరకెక్కబోతున్నది. ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అన్నది సస్పెన్స్ గా మారింది. జబర్డస్ట్ యాంకర్ అనసూయ ఓ కీలక పాత్ర కోసం తీసుకున్న సంగతి తెలిసిందే.
మొదట ఈ సినిమాలో నయనతార హీరోయిన్ అనుకున్నా ఆమెను పక్కన పెట్టారు. కారణం ఏంటి అన్నది పెద్దగా తెలియడం లేదు. నయనతారను కాకుండా ఐశ్వర్యారాయ్ ను కూడా అనుకున్నా అది సెట్ కాలేదు. ఇప్పుడు కాజల్ పేరు వినిపిస్తోంది. మరి కాజల్ అయినా ఒకే అవుతుందా లేదా అన్నది తెలియాలి.