మహేష్ బాబు కుటుంబానికి ఎలాంటి విలువ ఇస్తాడో అందరికి తెలిసిందే.  అందుకే మహేష్ ను నమ్రత ప్రేమించి పెళ్ళి చేసుకుంది. మహేష్ బాబు, నమ్రతలు వంశి సినిమాలో కలిసి నటించారు.  ఈ మూవి పెద్దగా హిట్ కాకపోయినా, మహేష్, నమ్రతల మధ్య ప్రేమను పుట్టించింది.  2000 సంవత్సరం నుంచి ఇద్దరు ప్రేమలో ఉన్నారు.  ఈ విషయం ఈ ఇద్దరికి కాకుండా తెలిసిన మూడో వ్యక్తి సంజయ్ దత్.  


మహేష్.. నమ్రతలు ప్రేమించుకుంటున్న విషయాన్ని నమ్రత మొదట తన స్నేహితుడు, కో నటుడు సంజయ్ దత్ కు చెప్పిందట.  నమ్రత చెప్పిన విషయం విని షాక్ అయ్యాడు.  అప్పటి నుంచి సెట్స్ లో తనను మహేష్ గురించిన విషయాలు చెప్పమని ఆటపట్టించేవాడని నమ్రత గుర్తు చేసుకుంది.  


సంజయ్ దత్ పైకి గంభీరంగా కనిపించినా, లోపల చాలా మంచి వ్యక్తి అని, సంజయ్ స్నేహితుడిలా కలిసిపొతే, వాళ్లకోసం ఏం చేయడానికైనా రెడిగా ఉంటాడని నమ్రతా చెప్పుకొచ్చింది.  ఔట్ డోర్ షూటింగ్ సమయంలో బయటి వ్యక్తుల నుంచి హీరోయిన్లను కాపాడటంలో సంజయ్ ముందు ఉంటాడని నమ్రత చెప్పింది.  సంజయ్ కు అప్పుడే 60 సంవత్సరాలు వచ్చాయి అంటే నమ్మలేక పోతున్నానని ఓ ఇంటర్వ్యూలో చేప్పింది.  


2000 వ సంవత్సరం నుంచి ప్రేమించుకుంటున్న మహేష్, నమ్రతలు 2005, ఫిబ్రవరి 10 వ తేదీన ఈ ఇద్దరు పెళ్ళి చేసుకున్నారు.  పెద్దల సమక్షంలో వీరికి ముంబైలో పెళ్ళి జరిగింది.  ఈ పెళ్లికి కొంతమంది మాత్రమే హాజరయ్యారు.  మహేష్ సమయం దొరికితే చాలు, కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తుంటారు.  ప్రస్తుతం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబొతున్నది.  మహేష్ 25 వ సినిమా మహర్షి సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే 


మరింత సమాచారం తెలుసుకోండి: