బెల్లంకొండ  సాయి శ్రీనివాస్ కి ఒక్క జయ జానకి నాయక తప్ప ఇప్పటివరకు చెప్పుకోదగ్గ హిట్ సినిమా ఏదీ పడలేదు. అయినా ఏదో ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తూనే  ఉన్నాడు. అది కూడా టాప్ హీరోయిన్ తో జత కడుతు. ఇంకొన్ని గంటల్లో శ్రీనివాస్ కొత్త సినిమా రాక్షసుడు మొదటి షోలు పడబోతున్నాయి. తమిళ్ లో గత ఏడాది సెన్సేషనల్ హిట్ గా నిలిచిన రట్ససన్ కు ఈ సినిమా అఫీషియల్ రీమేక్. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా, రాజీవ్ కనకాల-సూర్య ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాధారణంగా ఈ హీరో సినిమాల ప్రీ రిలీజ్ ముందు చాలా హడావిడి ఉంటుంది. ఆ విషయం అల్లుడు శీను నుంచి సీత సినిమా వరకు గమనిస్తే అర్థమవుతుంది. కానీ ఏ సినిమా ఇప్పటివరకు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఇక  ఆల్రెడీ ప్రూవ్ అయిన సబ్జెక్టుతో సాయి శ్రీనివాస్ సినిమా చేస్తే దానికి  ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ లేకపోవడం షాకవాల్సిన విషయమే.
 
ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం తప్ప ఇంకే రకంగానూ రాక్షసుడు సినిమా మార్కెట్ లోకి ప్రమోట్ కావడం లేదు. ఇక్కడ మరికొన్ని  కారణాలు గమనించాలి. ఇప్పటిదాకా సాయి శ్రీనివాస్ చేసిన మొదటి సినిమా నుంచి ఇప్పటిదాకా సమంత, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్..ఇలా అందరూ టాప్ హీరోయిన్స్ తో చేశాడు. అంతేకాదు స్టార్ హీరోలకే డేట్స్ దొరకని పూజా హెగ్డేను సాక్ష్యం సినిమా కోసం తీసుకొచ్చాడు. ప్రతిదాంట్లోనూ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉండేవి. పని చేసిన దర్శకులందరూ ఫామ్ లో ఉన్నవాళ్లే. 

కానీ రాక్షసుడికి ఇలాంటి ఆకర్షణలు ఏమి లేవు. కేవలం పోస్టర్లు ట్రైలర్ల పబ్లిసిటీ మీద ఆధారపడుతోంది. దీంతో ఇదో సినిమా వస్తోందన్న ఆలోచన కూడా ప్రేక్షకులకు రానంత వీక్ గా ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటిదాకా చేసిన సినిమాలకు పబ్లిసిటీ  చేసినా చేయకపోయినా అట్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి బండి నడిచింది. కానీ రాక్షసుడు అవేవి చేయకుండా సైలెంట్ గా ఉండటం సినిమా ఓపెనింగ్స్ పై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. డియర్ కామ్రేడ్ సినిమాకే అంత చేసినా ఫలితం లేకపోయింది. మరి శ్రీనివాస్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నాడో అర్థం కావడం లేదనే టాక్ వినిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: