నమ్రత ఘట్టమనేని ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. హీరో మహేష్ బాబు వైఫ్‌గా సూపర్‌స్టార్‌కు సంబంధించిన అన్ని విషయాలను చూసుకుంటూ ఉంటుంది. అంతేకాదు నమ్రతను పెళ్లి చేసుకున్న తర్వాతే హీరోగా మహేష్ బాబు కెరీర్ స్పీడ్ అందుకుంది. ఇక వీళ్లిద్దరు బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వంశీ’ సినిమాలో మాత్రమే కలిసి నటించారు. 


ఆ సినిమాలో వీళ్లిద్దరు కలిసి నటించడం వీరి జీవితాన్నే మార్చివేసిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ కూడా కీలక పాత్రలో నటించడం విశేషం. ఒక రకంగా భర్త, మామలతో కలిసి నమ్రత ఈ సినిమాలో యాక్ట్ చేయడం విశేషం. ఇక మహేష్ బాబుతో నమ్రత.. టాలీవుడ్‌లో సినిమా చేయకముందే ఆమెకు బాలీవుడ్‌లో చాలా సినిమాల్లో నటించింది. తాజాగా నమ్రత మీడియాతో మాట్లాడుతూ.. అప్పట్లో బాలీవుడ్‌లో చేసిన ‘వాస్తవ్’ సినిమాతో పాటు అందులో సహ నటుడు సంజయ్ దత్‌ గురించి ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు  ఆసక్తి కర విషయాలను వెల్లడించింది.


ఈ మధ్యనే సంజయ్ దత్ 60 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా నమ్రత మాట్లాడుతూ.. సంజయ్‌కు అపుడే 60 ఏళ్లు నిండాయా అని ఆశ్యర్యపోయానన్నారు. అంతేకాదు సంజు సెట్లో ఎపుడు చిన్న పిల్లాడిలా ప్రవర్తించే వాడని గుర్తు చేసుకున్నారు. సెట్లో అందరినీ కంటికి రెప్పలా చూసుకునే వాడని గుర్తు చేసుకుంది. ఆ సినిమా షూటింగ్ జరిగినన్నాళ్లు సంజయ్ నాతో పాటు సహ నటులతో ఎంతో సరదాగా ఉండేవారన్నారు.


ఇక ‘వంశీ’ సినిమా షూటింగ్ సమయంలో నేను మహేష్ బాబుతో ప్రేమలో పడ్డాను. ఆ విషయాన్ని ముందుగా నేను సంజయ్ దత్‌కే చెప్పానన్నారు. అపుడు సంజయ్ దత్ చిన్న పిల్లాడిలా తన కాలు లాగేసిన విషయాన్ని చెప్పారు. ఇక మా ప్రేమ విషయం తెలిసిన మొదటి వ్యక్తి కూడా సంజయ్ దత్తే అని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 2000లో వంశీ సినిమాలో కలిసి నటించిన వీళ్లిద్దరు..2005లో మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. మహేష్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత నమ్రత సినిమాలకు పూర్తిగా చెప్పేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: