సినిమా వాళ్ళకు మీడియాకి ఉన్న రిలేషన్ షిప్ గురించి అందరికీ తెలుసు. సినిమా ప్రమోషన్ విషయంలో మీడియా పాత్ర చాలా కీలకం. అందుకే దర్శకులు కానీ, హీరోలు కానీ మీడియాతో మంచి రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మీడియా మీద నిప్పులు చెరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా విరుచుకుపడి తమ సినిమాకు ప్రమోషన్లు లేక  నష్టం తెచ్చుకున్న వాళ్ళూ ఉన్నారు.


గతంలో రామ్ గోపాల్ వర్మ మీడియాతో పెట్టుకునే కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు. తనను ఇంటర్వ్యూ చేసినపుడల్లా మీడియా వాళ్లను ఆటాడుకోవడం.. మీడియా గురించి తక్కువగా మాట్లాడటం ఆ రంగంలోని వాళ్లకు మంట పుట్టించింది. దక్షిణాది నుంచి వచ్చిన వాడు నేషనల్ మీడియాను ఆడుకోవడం అక్కడి జనాలకు నచ్చలేదు. పైగా మీడియాను టార్గెట్ చేస్తూ ‘రణ్’ అనే సినిమా కూడా తీశాడు. ఈ రంగంలోని లుకలుకలన్నీ బయటపెట్టాడు. దీంతో మీడియా ఒక్కటైంది.


ఆ తర్వాత వర్మను ఒక పద్ధతి ప్రకారం సైడ్ చేయడంలోనూ మీడియా కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు కంగనా రనౌత్ పరిస్థితి కూడా ఇలాగే తయారైనట్లుంది. ఆల్రెడీ ఆమెకు బాలీవుడ్లో చాలామంది ప్రముఖులతో గొడవలున్నాయి. అవి చాలవన్నట్లు మీడియా వాళ్లతోనూ సున్నం పెట్టుకుంది. తన కొత్త సినిమా ‘జడ్జిమెంటల్ హై క్యా’ ప్రమోషన్ల సందర్భంగా ఓ మీడియా ప్రతినిధిని టార్గెట్ చేసింది. దీంతో ఆ వర్గం వాళ్లంతా ఒక్కటయ్యారు. క్షమాపణ చెప్పమని అడిగారు.


కంగనా తగ్గకపోయేసరికి ఆ సినిమాకి మీడియాలో ప్రచారమే లేకుండా చేసారు. కంగనా రనౌత్ సినిమా రిలీజ్ అయినట్టు కూడా చాలా మందికి తెలియదు.సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చినా వసూళ్లు లేవు. మౌత్ టాక్ పెద్దగా స్ప్రెడ్ కాలేదు. మొత్తానికి సినిమా బాగున్నా వసూళ్లు లేవు. సినిమా డిజాస్టర్ దిశగా అడుగులేస్తోంది. కొందరు ఈ సినిమా అద్భుతం అన్నారు కానీ.. వసూళ్లు మాత్రం దారుణంగా ఉన్నాయి. ఈ సినిమా పోవడంలో మీడియా పాత్ర కీలకం అని భావిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: