ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్లలో ఒకరు పూజా హెగ్డే.  వరసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నది.  ఇప్పటికే ఆమె టాలీవుడ్, బాలీవుడ్ లలో వరసగా సినిమాలు చేస్తున్నది.  డిజె వరకు ప్రయాణం స్లోగా సాగింది.  అక్కడి నుంచి అసలైన ప్రయాణం మొదలైంది.  డీజే సినిమా తరువాత ఆమెకు ఆఫర్లు వరసగా వచ్చాయి.  ఎన్టీఆర్ తో అరవింద సమేత సూపర్ హిట్టైంది.  


ఆ వెంటనే మహేష్ బాబుతో మహర్షి సినిమా చేసింది.  ఈ మూవీ కూడా సూపర్ హిట్టైంది.  వరసగా రెండు హిట్స్ కొట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం ప్రభాస్ తో జాన్ సినిమా చేస్తున్నది.  ఇది భారీ బడ్జెట్ సినిమా.  దీంతో పాటు  వరుణ్ తేజ్ తో వాల్మీకి సినిమా చేస్తున్నది.  ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.  సెప్టెంబర్ 13 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.  


సినిమా రంగంలో అదృష్టం కొంతవరకే కలిసి వస్తుంది.  ఆ తరువాత టాలెంట్ ఉండాలి.  టాలెంట్ సినిమాను నిలబెడుతుంది.  నటీనటుల్ని నిలబెడుతుంది.  కష్టపడి పనిచేయాల్సిందే.  విజయం అన్నది బోనస్ గా వస్తుంది.  విజయం,  పరాజయం అన్నది మన చేతిలో లేదు.  విజయానికి దగ్గరి దారి కూడా లేదని ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది పూజా.  


పూజా టాలీవుడ్ లో తనకు విజయంతో మంచి అవకాశం ఇచ్చిన డీజే హీరో  అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నది.  ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.  సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ఫాదర్ సెంటిమెంట్ గా తెరకెక్కుతోంది.  అటు బాలీవుడ్ లోను ఈ హీరోయిన్ వరసగా సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది.  అక్షయ్ కుమార్ తో హౌస్ ఫుల్ 4 సినిమా  చేసింది.  ఈ సినిమా దీపావళికి రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాతో పాటు మరోకొన్ని సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: