బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఐదు సంవత్సరాలు కావస్తున్నా క్రమంలో మరోపక్క తాను నటించిన రాక్షసుడు సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ ఐదు సంవత్సరాల సినీ ప్రయాణం గురించి షాకింగ్ కామెంట్ చేశారు. ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులను అలరించలేకపోయాయి ఇది నా తప్పేనని తన తప్పు ఒప్పుకున్నాడు.


భవిష్యత్తులో కచ్చితంగా విజయవంతమైన సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిస్తాయని మంచి మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని ఇప్పటినుండి నా కెరీర్ ప్రారంభం అయిందని రాక్షసుడు నా మొదటి సినిమా అని రెండో సినిమా కోసం వెయిట్ చేయండి అంటూ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎమోషనల్ గా స్పీచ్ ఇచ్చాడు. మరియు అదే విధంగా ఎన్నాళ్లు తన సినీ కెరీర్ ప్రయాణంలో తోడుగా ఉన్న కుటుంబ సభ్యులకు స్నేహితులకు కృతజ్ఞతలు అని తెలిపారు. ఈ క్రమంలో రాక్షసుడు సినిమా గురించి మాట్లాడుతూ ``అల్లుడు శీను` ఐదేళ్ల క్రితం రిలీజైంది.


అభిమానుల ప్రేమ అండతోనే ఈ పయనం సాధ్యమైంది. రాక్షసుడు నాకు పర్సనల్ గా చాలా ఇష్టమైన సినిమా. అద్భుతమైన థ్రిల్లర్. ఎగ్జయిట్ మెంట్ పెంచే కథతో తెరకెక్కింది. ఇలాంటివి అరుదుగా దొరికే స్క్రిప్ట్. ఇంత మంచి స్క్రిప్ట్ నాకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నా. దర్శకుడు ప్రతి  ఫ్రేమ్ ని అద్భుతంగా తీర్చిదిద్దారు. క్రిస్టోపర్ అనే నటుడే ఒక రాక్షసుడు. కంటెంటే ఈ సినిమాకు హీరో. అందుకనే `రాక్షసుడు` అనే టైటిల్ పెట్టాం`` అని శ్రీనూ అన్నారు. ఈ విధంగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా హీరో కార్తికేయ కూడా తన తప్పులను తెలుసుకున్నానని భవిష్యత్తులో సరిదిద్దుకుంటామని తెలపడం జరిగింది. ఇదే తరుణంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఇటువంటి కామెంట్లు చేయడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్ర హీరోల మైండ్ సెట్ మారిందని ఇండస్ట్రీలో ఉన్న చాలామంది అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: