మరికొద్ది రోజుల్లో 60 వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న కింగ్ నాగార్జున బర్తడే వేడుకలను కొడుకు నాగ చైతన్య కోడలు సమంత మరియు అక్కినేని కుటుంబ సభ్యులు అదిరిపోయే రీతిలో చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వినపడుతోంది. అంతేకాకుండా ప్రస్తుతం మన్మధుడు 2 సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవిని ఈ సినిమా విషయంలో ఫాలో అవుతున్నట్లు సమాచారం.


ఇంతకీ విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి తాను నటించిన సినిమా విషయంలో ఎడిటింగ్ రూమ్ లో ఎక్కువ గడుపుతారని ...అవుట్ పుట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా కావలసిన సీన్లను ఉంచుతూ బోర్ కొట్టే సన్నివేశాలను ఎడిటింగ్ చేయించుకుంటూ చాలా శ్రద్ధగా ఎడిటింగ్ రూమ్ లో సినిమా అద్భుతంగా వచ్చేవరకు చాలా సిన్సియర్ గా ఉంటారని ఫిలింనగర్ లో ఓ నానుడి ఉంది. అదేవిధంగా కింగ్ నాగార్జున నటించిన `మన్మధుడు 2` విషయంలో చిరునే ఫాలో అవుతున్నారట. రోజూ ఎడిటింగ్ టేబుల్ దగ్గర ప్రత్యక్ష్యమవుతున్నారట. రాహుల్ కన్నా ఎక్కువ శ్రద్ద ని నాగ్ చూపెట్టడం చూసి టీమ్ ఆశ్చర్యపోతోందట.


దాదాపు 15 నిముషాలు పాటు ఫైనల్ కట్ నుంచి మళ్లీ ఎడిట్ చేయించారని తెలుస్తోంది. ఫన్ పండినా, ఫ్లోకు అడ్డం వస్తోందని సినిమా అక్కడ ఆగిపోతోందని అనుకున్న చోట నిర్దాక్ష్యణంగా తీయించేసారట. ఈమధ్య సినిమా విడుదలయ్యాక ట్రిమ్మింగ్ కార్యక్రమాలు ఎక్కువయ్యాయి అయితే మన్మధుడు విషయంలో అలా జరగకుండా ఉండాలని ముందు నుండే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వటానికి నాగార్జున చాలా కష్టపడుతున్నారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా కీర్తి సురేష్ అలాగే సమంత అతిధి పాత్రలో నటించినట్లు ఫిలిం నగర్ టాక్. ఎన్నడూ లేనివిధంగా సినిమాలో అద్భుతమైన రొమాన్స్ సన్నివేశాల్లో నాగార్జున ఇరగదీసినట్టు...అటువంటి సన్నివేశాలు నాగచైతన్య అఖిల్ కూడా చేయలే నట్టు అన్నట్టుగా నటించారట. దీంతో ఈ సినిమాపై అక్కినేని అభిమానులకు విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: