ఇప్పుడు ఎక్కడ చూసినా సాహో టాపిక్కే, ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో చూపుతుంది. సాహోకి వస్తున్న ప్రభాస్. అయితే ప్రభాస్ విషయంలో మాత్రం పెదనాన్న కృష్ణంరాజు తెగ వర్రీ అవుతున్నారట. ప్రభాస్ ను ఇప్పుడు కేవలం తెలుగు హీరోగా చూడలేం, ఆయన రేంజ్ ఆయన ఇమేజ్ టోటల్ గా చేంజ్ అయినది. ఇప్పుడు ప్రభాస్ నేషనల్ స్టార్. ప్రభాస్ పేరు మీదే 300 నుంచి 400 కోట్ల బిజినెస్ జరుగుతుంది. సాహోకి అలాగే జరిగింది. అయినా కూడా ప్రభాస్ గురించి పెదనాన్న కృష్ణంరాజు వర్రీ అవుతున్నారట. కృష్ణంరాజు చాలా ఏళ్ల తరువాత తన బానర్ పై మళ్లీ సినిమాని నిర్మిస్తున్నారు.



గోపీ కృష్ణా మూవీస్ బ్యానర్ పై ఎన్నో ఏళ్ల తరువాత ఆయన సినిమాని నిర్మిస్తున్నారు. ప్రభాస్ హీరో, పూజా హెగ్డే హీరోయిన్, రాధా కృష్ణ కుమార్ అనే దర్శకుడు తీస్తున్న ఈ లవ్ స్టోరీ రెండేళ్ల క్రితమే ప్రారంభమైంది. అయితే ఇప్పటి వరకూ 30 శాతం షూటింగ్ కూడా పూర్తి కాలేదు. సాహోతో బిజీగా ఉండి ప్రభాస్ అప్పుడప్పుడు డేట్స్ ఇచ్చిన టైంలో యూరోప్ లోనూ హైదరాబాద్ లోనూ కొంత భాగం తీశారు. అసలు షూటింగ్ సాహో విడుదల తరువాత ఉంటుంది. ఇప్పటి వరకు తీసిన దాంట్లో కూడా చాలా వరకు పనికొచ్చే అవకాశం తక్కువే ఎందుకంటే రెండేళ్ల క్రితం తీసిన ఆ సీన్ లో వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే సినిమాకి సూటవ్వవు.


ప్రభాస్ ఫేస్ లో మార్పు ఉంటుంది. అందుకే మళ్లీ వాటిని ఫ్రెష్ గా సాహో విడుదల అయిన తరువాత తీస్తారట. దాంతో ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగా పెరగనుందనేది కృష్ణంరాజు వర్రి. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కి పెరిగిన క్రేజ్ ని త్వరలో క్యాష్ చేస్కొని మంచి బిజినెస్ చేసుకుందామని కృష్ణంరాజు యూవీ క్రియేషన్స్ కి ఈ సినిమా అప్పచెప్పారు. అయితే ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. అటు సాహో ఇటు ఈ సినిమా రెండు లేటయ్యాయి. అందుకే సాహో భారీగా హిట్ అయితేనే ఈ కొత్త సినిమాకి కూడా సాహో రేంజ్ బిజినెస్ అవుతుంది. లేదంటే పెరిగిన బడ్జెట్ రిస్కే అదే కృష్ణంరాజుని వర్రి చేస్తోందట. ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా ప్రమోషన్స్ లో బిజి కానున్నాడు. ఈ కొత్త సినిమా షూటింగ్ ని అక్టోబర్ లో మొదలుపెడతారట. వచ్చే ఏడాది వేసవికి కానీ వచ్చే ఏడాది జులైలో కానీ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఈ సినిమా పూర్తి గా లవ్ స్టోరీ గా రూపొందనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: